కైకలూరు, న్యూస్లైన్ : కొద్దిపాటి వర్షానికే రాకపోకలు స్తంభించే లంకగ్రామాల ప్రజలను కొల్లేరు మరింత భయాందోలనకు గురిచేస్తోంది. విస్తార వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి బారీగా నీరు చేరుతుండడంతో కొల్లేరు సరస్సులో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది.దీంతో లంకగ్రామాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. కొద్ది నెలల క్రితం ఏడారిని తలపించిన కొల్లేరు ప్రస్తుతం నిండుకుండను తలపిస్తోంది. వరదల సమయంలో కొల్లేరుకు దాదాపు ఒక లక్షా 11వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది.
ప్రధానంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రామిలేరు, తమ్మిలేరు, గుండేరు, చంద్రయ్య కాల్వ, పోల్రాజ్, శ్యాంప్ వంటి 67 డ్రైయిన్ల నుంచి ఈ నీరు వస్తుంది. ఒక్క కృష్ణాజిల్లా నుంచే 35వేల 590 క్యూసెక్కుల నీరు వివిధ డ్రైయిన్ల ద్వారా కొల్లేరుకు చేరుతుంది. ప్రస్తుతం కొల్లేరు నీటిని దిగువకు పంపించే పెదయడ్లగాడి వంతెన వద్ద నీటి మట్టం శనివారం 1.7 మీటర్లకు చేరింది. రెండు రోజుల క్రితంవరకు 1.2 మీటర్లే సూచించింది. అదే విధంగా చినయడ్లగాడి, పోల్రాజ్ డ్రైయిన్లలో కూడా నీటిమట్టం రానురాను పెరుగుతుంది. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం కర్రల వంతెన వద్ద నీటి ఉధృతి మరింత పెరిగింది. దీంతో లోత ట్టు లంక గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇప్పటికే పెదయడ్లగాడి నుంచి పెనుమాకలంక గ్రామం చేరే రహదారి అంచునకు కొల్లేరు నీరు చేరింది. మరో రెండు రోజులు భారీగా నీరు చేరితే రోడ్డు మునిగి దిగువ గ్రామాలకు రాకపోకలు స్తంభించే ప్రమాదముంది. పై ప్రాంతాల నుంచి వస్తున్న నీటి కారణంగా పలు గ్రామాల్లో కొల్లేరు ఆపరేషన్ సమయంలో కొట్టేసిన చెరువుల్లోకి నీరు చేరింది. ప్రధానంగా కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం, శృంగవరప్పాడు, చటాకాయి, కొట్డాడ, వడ్లకూటితిప్పా, మండవల్లి మండలంలో పెనుమాకలంక, నందిగామలంక, మణుగునూరు, కొవ్వాడలంక గ్రామాలు ముంపు బారిన పడే అవకాశం ఉంది.
గుబులు పుట్టిస్తున్న గుర్రపుడెక్క......
ఎగువ నుంచి చేరుతున్న నీటి ప్రవాహానికి కొల్లేరులో దట్టంగా పెరుకుపోయిన గుర్రపుడెక్క, కిక్కిస అవరోధంగా మారాయి. డ్రైయిన్ల క్రమబద్ధీకరణ జరగకపోవడం కారణంగా కొల్లేరులోకి చేరే ఒక లక్షా 11వేల క్కూసెక్కుల నీటిలో కేవలం 12వేల క్యూసెక్కుల నీరు మాత్రమే ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి చేరుతుంది. కనీసం 15 వేల క్యూసెక్కుల నీటిని పంపించే సామర్థాన్ని పెంచేందుకు రూ. 35 కోట్ల ప్రతిపాదనలను అధికారులు ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి పంపారను. అయితే ఇప్పటికీ ఆ పనులు ప్రారంభం కాలేదు.
అదే విధంగా కొల్లేరులోని 67 డ్రైయిన్లు అభివృద్ధి చేయడానికి (అంటే తూడు, కిక్కిస, చెత్తను తొలగించడం) రూ. 11 కోట్లతో ఆధునికీకరణ పనులకు టెండర్లు పిలిచారు. కొన్ని కారణాల వలన ఈ పనులు నిలిచాయి. ప్రస్తుతం పెదయడ్లగాడి, చినయడ్లగాడి వంతెన వద్ద పలు ఖానాల్లో గుర్రపుడెక్క, కిక్కిస పెరుకుపోయింది. అదే విధంగా కొల్లేరు నీటిని సముద్రానికి చేరవేసే ఉప్పుటేరు వంతెన వద్ద గుర్రపుడెక్క నీటి ప్రవాహానికి అడ్డువస్తుంది. అధికారులు ముందస్తు చర్యగా గుర్రపుడెక్కను తొలగించకపోతే గ్రామాలు ముంపుబారిన పడతాయని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు.
గుర్రపు డెక్క తొలగిస్తాం....
కొల్లేరుకు నీటిని చేరవేసే పలు డ్రైయిన్లలో గుర్రపుడెక్కను నిర్మూలించడానికి ప్రణాళిను తయారు చేస్తున్నట్లు డ్రైయినేజీ జేఈ రామిరెడ్డి తెలిపారు. అత్యవసర మయిన ప్రాంతాల్లో డెక్కను తొలగిస్తామని చెప్పారు. పెదయడ్లగాడి వద్ద నీటిమట్టం 2.5 మీటర్లుకు చేరితే ప్రమాదకర మేనని అంగీకరించారు. ఎగువ నుంచి చేరుతున్న నీటి కారణంగా నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
కొంప ‘కొల్లేరే’నా?
Published Sun, Sep 22 2013 1:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement