సాక్షి ప్రతినిధి, కర్నూలు/కోడుమూరు, న్యూస్లైన్: కర్నూలుకు చెందిన రమేష్ ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని హంపికి వెళ్లాలని సిద్ధమయ్యారు. ఇందుకోసం ఓ ప్రైవేట్ వాహనాన్ని బుక్ చేసుకున్నారు. బయలుదేరే ముందు వాహన డ్రైవర్ చెప్పిన సమాధానం వారిని ఆశ్చర్యపర్చింది. బాడుగనైనా వదులుకుంటాను కానీ.. కోడుమూరు మీదుగా రానంటే రానని మొండికేశాడు. ఆ రహదారిలో వెళితే వాహనం ఎందుకూ పనికిరాకుండా పోతుందని.. పైగా ఆ కుదుపులకు ఒళ్లంతా పులిసిపోతుందని తన గోడు వెళ్లబోసుకున్నాడు.
మీకూ క్షేమం కాదని డ్రైవర్ వారించడంతో చివరకు వారంతా డోన్ మీదుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. కర్నూలు-బళ్లారి రహదారిలో ప్రయాణమంటే ఎలా ఉంటుందో ఇదో ఉదాహరణ మాత్రమే. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం ఈ దారిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులకు హాజరవుతున్నారు. తమ తప్పు లేకపోయినా జరిగిపోయే ప్రమాదానికి ఎక్కడ బాధ్యులమవుతామోనని వారు నిత్య నరకం చూస్తున్నారు. గురువారం ‘సాక్షి’ బృందం ఈ రహదారిలో ప్రయాణించింది. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆదోని బస్సులో ఎక్కగా రెండు కిలోమీటర్లు దాటగానే అవస్థలు మొదలయ్యాయి. అడుగడుగునా మోకాల్లోతు గుంతలు.. కుదుపులతో బస్సుల్లోని ప్రయాణికులంతా తమ సీట్లలో నుంచి ఎగిరిపడుతున్నారు. పాలు పట్టినా.. జోల పాడినా చంటిబిడ్డ ఏడుపు ఆపకపోవడంతో సరోజ అనే మహిళ తల్లడిల్లింది.
దుమ్ము లేస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నడుమ రెండు గంటలు ప్రయాణించగా కోడుమూరుకు చేరుకున్నాం. అక్కడి నుంచి మరో రెండు గంటల ప్రయాణంతో ఎట్టకేలకు ఆదోనికి వెళ్లగలిగాం. అక్కడి నుంచి ఆలూరు నియోజకవర్గంలోని వందవాగిలి, ఎల్లార్తికి వెళ్లేందుకు మరో బస్సులో ప్రయాణించాం. కంకర తేలిన రోడ్డుపై ప్రయాణం అత్యంత కష్టంగా సాగింది. నాగన్న అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా టైర్ పగిలి గాయాలపాలవడం.. సిద్దప్ప అనే వ్యక్తి కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పంక్చరైంది. దీంతో ఆ వాహనాన్ని ఓ చెట్టుకింద పెట్టి ఆటోలో ఆదోనికి వెళ్లిన ఘటనలు కనిపించాయి. చివరకు వందవాగిలికి చేరుకునే సరికి.. హమ్మయ్యా వచ్చేశామనిపించింది.
పర్సెంటేజీలకు జడిసి చేతులెత్తేసిన
కాంట్రాక్టర్
రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని కర్నూలు-బళ్లారి మధ్య 30 మీటర్ల(డబుల్ లైన్) రోడ్డు వేసేందుకు ఐదేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొచ్చారు. రూ.120 కోట్లతో అంచనాలు రూపొందించగా.. కర్నూలు నుంచి దేవనకొండ వరకు 55 కి.మీ.ల రోడ్డు వేసేందుకు ఏపీఆర్డీసీ సంస్థ టెండర్లను ఆహ్వానించింది. 30 శాతం లెస్తో రూ.75 కోట్లకు పనులు దక్కించుకున్న రాణి కన్స్ట్రక్షన్స్ రోడ్డు నిర్వహణ పనులు మొదలు పెట్టింది.
కోడుమూరు, ప్యాలకుర్తి, లింగందిన్నె గ్రామాల వద్ద రోడ్డుకు ఇరువైపులా మట్టి తీసి కోటి రూపాయల వ్యయంతో గ్రావెల్ పనులు చేపట్టింది. అప్పటికి మొబిలైజేషన్ నిధుల కింద రూ.10 కోట్లను ప్రభుత్వం నుంచి ఆ సంస్థ తీసేసుకుంది. అయితే పర్సెంటేజీల కోసం రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అధికం కావడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. అదేవిధంగా ఎల్లార్తి రోడ్డుకు రూ.8 కోట్లు మంజూరైనా టెండర్లు పిలువలేదు. మార్లమరికి రోడ్డు మరమ్మత్తుల కోసం రూ.60 లక్షలకు ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడం గమనార్హం.
బెంబేలెత్తిస్తున్న కర్నూలు-బళ్లారి రహదారి
Published Sat, Nov 23 2013 4:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement