రేపు సీఎం రాక | kiran kumar reddy West Godavari district Tour 15th november | Sakshi
Sakshi News home page

రేపు సీఎం రాక

Nov 14 2013 2:50 AM | Updated on Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 15వ తేదీన జిల్లాకు రానున్నారు. పోడూరు మండలం జగన్నాథపురంలో

ఏలూరు, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 15వ తేదీన జిల్లాకు రానున్నారు. పోడూరు మండలం జగన్నాథపురంలో ఆచంట నియోజకవర్గ రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 15న మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో పెనుగొండ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జగన్నాథపురం వెళతారు. రచ్చబండ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు పెనుగొండ ఏఎంసీ కార్యాలయానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ తర్వాత రోజు పెనుగొండ నుంచి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. అయితే సీఎం పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. ఒకవేళ 15న సీఎం రాకపోతే 16న ఆయన పర్యటన ఉంటుందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement