హుదూద్ తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని త్వరగా పంపాలని కేంద్రానికి కంభంపాటి రామ్మెహన్ సూచించారు.
'తక్షణ సహాయాన్ని వెంటనే విడుదల చేయండి'
Oct 16 2014 6:50 PM | Updated on Sep 2 2017 2:57 PM
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు భేటి అయ్యారు. హుదూద్ తుఫాన్ తాకిడి గురైన ప్రాంతాలు, బాధితులకు కోసం ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన వెయి కోట్ల సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని రాజ్ నాథ్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.
హుదూద్ తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని త్వరగా పంపాలని కేంద్రానికి కంభంపాటి రామ్మోహన్ రావు సూచించారు.
Advertisement


