జర్నలిస్టులకు నిధులు కేటాయించాలి | journalists need specoal grants | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు నిధులు కేటాయించాలి

Mar 21 2017 5:03 PM | Updated on Sep 5 2017 6:42 AM

జర్నలిస్టులకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ కోరారు.

విజయవాడ: జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుని కోరారు. తెలంగాణాలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా రూ.30కోట్లు కేటాయించినట్లే ఏపీలోను ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలను వెలికితీసే జర్నలిస్టులకు మాత్రం ఏవిధమైన సహాయం అందడంలేదన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరిస్తోందని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement