బుధవారం ఎంపీ పదవికి రాజీనామా: జేసీ

వచ్చే బుధవారం ఎంపీ పదవికి రాజీనామా: జేసీ


సాక్షి, అనంతపురం : అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎంపీగా ఫెయిల్‌ అయినట్లు తన మనస్సాక్షి చెబుతోందని, అందుకే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. చాగల్లుకు నీళ్లు తేలేని తానకు ఎంపీ పదవి ఎందుకని అన్నారు. తాడిపత్రి సాగు, తాగు నీటి అవసరాలను తీర్చలేకపోయానని, అలాగే అనంతపురంలో రోడ్లను విస్తరించలేకపోయినట్లు చెప్పారు.


తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో గెలవలేదని, ప్రజల మద్దతుతోనే ఎంపీ అయ్యాయని అన్నారు. తనలాంటివాళ్లు రాజకీయాల్లో ఉండటం వృథా అని, విలువలేనప్పుడు పదవిలో కొనసాగడం భావ్యం కాదని తెలిపారు. ఈనెల 25 లేదా 26న ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌కు అందజేస్తానన్నారు. అయితే పదవికి మాత్రమే రాజీనామా చేస్తానని, పార్టీకి కాదని ఆయన తెలిపారు. తాను పదవికి రాజీనామా చేసినా చంద్రబాబు వెంటే ఉంటానని జేసీ చెప్పుకొచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top