=ఎంఫిల్, పీహెచ్డీ అడ్మిషన్లలో గందరగోళం
=ఆందోళనలో విద్యార్థులు
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్లైన్: ఏదైనా ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు వస్తే సీటు తప్పకుండా వస్తుంది. ఎస్వీయూలో మాత్రం రీసెట్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థినికి పీహెచ్డీలో సీటు దక్కలేదు. ఎస్వీ యూనివర్సిటీలో సోమవారం నుంచి నిర్వహిస్తున్న ఎంఫిల్, పీహెచ్డీ అడ్మిషన్లలో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. ప్రొద్దుటూరుకు చెందిన విద్యార్థిని ఎస్.గంగాదేవి ఎస్వీయూలో రీసెట్-2013లో భాగంగా నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఈమె 86 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించింది.
బుధవారం సాయంత్రం జరిగిన కౌన్సెలింగ్కు హాజరైంది. ఎస్వీయూ అధికారులు నెట్, సెట్లలో అర్హత సాధించిన వారందరికీ సీట్లు కేటాయించడంతో ఈమెకు ఇవ్వడానికి సీటు మిగల్లేదు. మొదటి ర్యాంకు సాధించినా సీటు రాకపోతే రీసెట్ పేరిట ప్రవేశపరీక్ష ఎందుకు నిర్వహించాలని ఆమె ప్రశ్నిం చారు. తాను నాన్ లోకల్ కాదని, రీసెట్లో తెలుగు విభాగంలో మొదటి ర్యాంకు వచ్చినా సీటు ఇవ్వకపోవడం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చేదు అనుభవమే మరొకరికి ఎదురైంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఒక విద్యార్థిని మొదటి ర్యాంకు సాధించినా ఎస్వీయూ అధికారులు కౌన్సెలింగ్కు పిలువలేదు. ఎస్వీయూ అధికారుల నిబంధనలు సక్రమంగా లేకపోవడంతో తాము ర్యాంకులు సాధించినా సీట్లు రాక ఇబ్బందులు పడుతున్నామని పలువురు
విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు కొనసాగుతున్న అడ్మిషన్లు
ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఎంఫిల్, పీహెచ్డీ అడ్మిషన్లలో భాగంగా బుధవారం సోషియల్ వర్క్, తమిళ్, ఉమెన్స్టడీస్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇంగ్లీష్, తెలుగు విభాగాలకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించింది. తెలుగు విభాగానికి సంబంధించి ఎస్టీ క్యాటగిరిలో అడ్మిషన్ విషయంపై కొందరు విద్యార్థుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే డీవోఏ డెరైక్టర్ శ్రీధర్రెడ్డి జోక్యంతో సమస్య సద్దుమణిగింది.
మొదటి ర్యాంకర్కూ దక్కని చోటు
Published Thu, Dec 12 2013 3:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement