సీఎం సహాయనిధికి విరాళాలు | Huge Donations To AP CM Relief Fund | Sakshi
Sakshi News home page

సీఎం సహాయనిధికి విరాళాలు

May 4 2020 6:13 PM | Updated on May 4 2020 6:37 PM

Huge Donations To AP CM Relief Fund - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, నియోజకవర్గ నాయకులు,అభిమానులు రూ.1,00,25,000 విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, గంగసాని హుస్సేన్‌ రెడ్డి, డాక్టర్‌ పెరుగు మురళీకృష్ణ విరాళం చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి పర్చూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ రావి రామనాథం బాబు, నియోజకవర్గ నాయకులు,అభిమానులు రూ.1,02,50,019 విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్చూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌  రావి నామనాథం బాబు, బత్తుల బ్రహ్మనందరెడ్డి, లీలాకృష్ణ విరాళం చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌కు అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, నియోజకవర్గ నాయకులు, అభిమానులు రూ.90 లక్షలు విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి విరాళం చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌కు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement