జిల్లాలో ఎడాపెడా కరెంట్ కోతలు | Heavy power cuts from today | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఎడాపెడా కరెంట్ కోతలు

Oct 6 2013 3:17 AM | Updated on Sep 18 2018 8:28 PM

సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం జిల్లాపై పడింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ నిరవధిక సమ్మెకు దిగడంతో వివిధ గ్రిడ్‌ల నుంచి జిల్లాకు సరఫరా అయ్యే విద్యు త్ నిలిచిపోయింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం జిల్లాపై పడింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ నిరవధిక సమ్మెకు దిగడంతో వివిధ గ్రిడ్‌ల నుంచి జిల్లాకు సరఫరా అయ్యే విద్యు త్ నిలిచిపోయింది. దీంతో తాండూరు, ఇబ్రహీంపట్నం, పరిగి, వికారాబాద్ సహా పలు ప్రాంతాల్లో శనివారం ఐదారు గంటల పాటు కరెంట్ కోత విధించారు. విజయవాడ, రాయలసీమ థర్మల్ పవర్‌స్టేషన్ల ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడంతో విద్యుత్ ఉత్పాదన ఆగిపోయింది.
 
 ఈ గ్రిడ్‌ల నుంచి జిల్లాకు కూడా కొంత కేటాయింపులు ఉన్న కారణంగా దీని ప్రభావం జిల్లాపై చూపింది. జల విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నందున కొంత మేర అవసరాలు తీరుస్తున్నప్పటికీ, థర్మల్ కేంద్రాల మూతతో 200 మెగావాట్ల విద్యుత్‌కు కోత పడింది. మరోవైపు సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కోతల వేళలను పెంచుతున్నట్లు ట్రాన్స్‌కో ప్రకటించింది. ఈ మేరకు శనివారం రాత్రి కిందిస్థాయి అధికారులకు సంక్షిప్త సందేశాలను జారీ చేసింది. ప్రస్తుతం రాత్రివేళలో మూడు గంటల పాటు వ్యవసాయ అవసరాలకు పంపిణీ చేస్తున్న త్రీఫేజ్ కరెంట్‌ను సింగిల్ ఫేజ్ ఇవ్వాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement