బాకీలు కట్టకపోతే ధర్నా చేస్తాం | GVMC revenue employees new trends on property tax recovery | Sakshi
Sakshi News home page

బాకీలు కట్టకపోతే ధర్నా చేస్తాం

Mar 7 2014 11:10 AM | Updated on Sep 2 2017 4:27 AM

ఇంటి యజమానుల వద్ద పెరుకుపోయిన ఆస్తి పన్ను మొండి బకాయిలను వసూలు చేసేందుకు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవిఎంసీ) రంగం సిద్ధం చేసింది.

ఇంటి యజమానుల వద్ద పెరుకుపోయిన ఆస్తి పన్ను మొండి బకాయిలను వసూల్ చేసేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా జీవీఎంసీ ఉద్యోగులు మొండి బకాయిలను వసూలు చేసేందుకు వినూత్నంగా రికవరీ చేపట్టారు.

నగరంలోని మొండి బకాయిలు చెల్లించని ఓ అపార్ట్మెంట్ ఎదుట జీవీఎంసీ రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగులు శుక్రవారం ఆందోళనకు దిగారు. సదరు అపార్ట్ మెంట్ వాసులు రూ. 1.72 లక్షల బకాయిలు జీవిఎంసీ చెల్లించాలి. ఆ మొత్తం చెల్లించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఉద్యోగులు భీష్మించుకుని కూర్చొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement