► గ్యాంగ్ రేప్.. ఆపై హత్యగా అనుమానాలు
► భామినిలో సంచలనం
► పోలీసు దర్యాప్తు ప్రారంభం
ఘనసర కాలనీ (భామిని): ప్రశాంతంగా ఉండే గ్రామంలో యువతి లైంగిక దాడి.. ఆపై హత్యకు గురైందనే వార్తతో భామిని మండలవాసులు ఉలిక్కి పడ్డారు. హతురాలు గ్రహణం మొర్రి బాధితులు కావడం గమనార్హం కాగా.. ఈ సంఘట స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. భామి ని మండలం ఘనసర కాలనీకి చెందిన 20 ఏళ్ల యువతి సోమవారం కాలనీ సమీపంలోని పీఏసీఎస్ భవనం వెనుక వెదురు పొదల మధ్య అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆదివారం రాత్రి కాలనీ నుంచి బహిర్భూమికి వెళ్ళిన సుమతి ఎప్పటికీ రాకపోవడంతోస్థానికులు సమీపంలోని వరద కాలువ చుట్టూ గాలించారు. తెల్లవారే సరికి ఇంటికి సమీపంలోని వెదురు పొదల వద్ద మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయారు.
ఆ యువతి కాలనీ శివారులో పూరింట్లో ఉంటూ కుట్టుపని చేసుకుంటూ, వ్యాధి గ్రస్తురాలైన తల్లిని పోషించుకుంటూ కాలం వెలుబుచ్చుతోంది. గ్రహణం మొర్రి గల ఆమె అత్యాచారం, ఆపై హత్య(?)కు గురికావడం గ్రామస్తులకు ఓ పట్టాన మింగుడు పడడం లేదు. ఐదేళ్ల క్రితం తండ్రి మృత్యువాత పడగా, తల్లి కేన్సర్ వ్యాధితో మంచం పట్టింది. కూతురు మృత్యువాత పడిన విషయం తెలిసి ఆ తల్లి ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఆదివారం రాత్రి ఎవరో పిలిస్తే తన కూతురు బయటకు వెళ్ళిందని ఆమె రోదిస్తూ చెబుతోంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో బహిర్భూమికి వెళ్లిన మహిళలు యువతి మృతదేహాన్ని గుర్తించారు.
మృతదేహం పడిన తీరు, ఒంటిపై దుస్తులు లేకుండా ఉండడాన్ని గుర్తించిన మహిళలు వెంటనే బట్టలు కప్పి గ్రామస్తులకు సమాచారం అందించారు. వీఆర్ఓ వి.చిన్నారావు సమాచారం మేరకు కొత్తూరు సిఐ కె.అశోక్ కుమార్, బత్తిలి ఎస్సై జి.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని చేరుకొని అనుమానాస్పద మృతిగా గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రికి జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం సంఘటన స్థలంలో తనిఖీ చేపట్టింది.
గ్యాంగ్ రేప్గా ప్రచారం
ఘనసర కాలనీకి చెందిన మృతికి సామూహిక లైంగిక దాడి, ఆపై హత్యగా ఇక్కడ ప్రచారం జరుగుతోంది. మృత దేహం మెడలో గట్టిగా చుట్టిన చున్నీ ఉంది. ముఖం నిండా గాయాలు, రెండు చేతులు చాచినట్లు పడి ఉండడం, ఒంటిపై దుస్తులు తొలగించి ఉండడాన్ని బట్టి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు దురాఘాతానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.
హత్య కేసుగా నమోదు
ఘనసర కాలనీ(భామిని): యువతి (20) అనుమానాస్పద మృతిని హత్య కేసుగా నమోదు చేసిన ట్లు శ్రీకాకుళం డీఎస్పీ రాంవర్మ స్పష్టంచేశారు. సోమవారం రాత్రి భామిని మండలం ఘనసర కాలనీ సమీపంలో సంఘటన స్థలాన్ని కొత్తూరు సీఐ అశోక్ కుమార్, బత్తిలి ఎస్సైతో కలిసి పరిశీలించారు. చుట్టుపక్కల ఇళ్లవారితో రహస్యంగా మాట్లాడి వివరాలు సేకరించారు. మృతురాలి తల్లిని పరామర్శించి, వివరాలు సేకరించారు.
యువతి అనుమానాస్పద మృతి
Published Tue, Jan 5 2016 3:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement