క్వార్టర్లు ఖాళీ చేయని మాజీలపై గద్దె ఆగ్రహం! | Sakshi
Sakshi News home page

క్వార్టర్లు ఖాళీ చేయని మాజీలపై గద్దె ఆగ్రహం!

Published Wed, Oct 29 2014 7:14 PM

క్వార్టర్లు ఖాళీ చేయని మాజీలపై గద్దె ఆగ్రహం!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే క్వార్టర్లను ఖాలీ చేయకుండా తిష్టవేసిన మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలపై క్వార్టర్ల కమిటీ చైర్మన్ గద్దె రామ్మోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 12 లోపు క్వార్టర్లను ఖాలీ చేయాల్సిందేనని రామ్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. 
 
లేదంటే క్వార్టర్లకు నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. 134 ఎమ్మెల్యేలో 12 మంది మాత్రమే ఖాలీ చేశారని ఆయన తెలిపారు. దాంతో కొత్త ఎమ్మెల్యేలకు క్వార్టర్లు కేటాయించడం కష్టంగా మారిందని గద్దె రామ్మోహన్ తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement