'అనంత'లో దొంగనోట్ల ముఠా అరెస్టు | fake currency gang arrest in anantapur | Sakshi
Sakshi News home page

'అనంత'లో దొంగనోట్ల ముఠా అరెస్టు

Jul 1 2015 12:25 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం మూడో పట్టణ పోలీసులు దొంగనోట్లు చలామణీ చేస్తున్న ఓ ముఠాను బుధవారం అరెస్టు చేశారు.

అనంతపురం: అనంతపురం మూడో పట్టణ పోలీసులు దొంగనోట్లు చలామణీ చేస్తున్న ఓ ముఠాను బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టు సమాచారం. వారి వద్ద నుంచి రూ.40 వేల అసలు కరెన్సీ, రూ.5 లక్షల నకిలీ కరెన్సీ, ఒక కంప్యూటర్, ప్రింటర్‌తో పాటు మరో 12 రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ వ్యక్తి నకిలీ కరెన్సీ మారుస్తుండగా పట్టుబడ్డాడు. అతనిని పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.

Advertisement
 
Advertisement
Advertisement