సీపీఎస్‌ రద్దు కోసం పోరాటం | Employees Demand CPS System YSR Kadapa | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు కోసం పోరాటం

Jul 24 2018 8:08 AM | Updated on Jul 24 2018 8:08 AM

Employees Demand CPS System YSR Kadapa - Sakshi

మాట్లాడుతున్న రఘురామిరెడ్డి

కడప ఎడ్యుకేషన్‌: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని (సీపీఎస్‌) రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని ఫ్యాప్టో రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ రఘురామిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే పోరుయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం కడప డీసీఈబీలో ప్రచారజాతకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో జూలై 30 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారజాతను నిర్వహించనున్నట్లు తెలిపారు.

తమ జీవితంలో భధ్రతను దెబ్బతీసే సీసీఎస్‌ను రద్దుచేయాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్‌ సుబ్రయణ్యంరాజు, సెక్రటరీ విజయ్‌కుమార్, నాయకులు లక్ష్మిరాజా, రఘనాధరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, శివారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, నిత్యప్రభాకర్, సివిప్రసాద్, సుబ్బరాజు, నరసింహారెడ్డి, గురవయ్య, మహేష్‌బాబు, శ్రీనివాసులరెడ్డి, మణికుమార్, ఖాదర్‌భాష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement