మే 24న ఎంసెట్-ఏసీ | emcet-ac on may 24 | Sakshi
Sakshi News home page

మే 24న ఎంసెట్-ఏసీ

Apr 22 2015 4:35 AM | Updated on Aug 18 2018 6:29 PM

ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్- అసోసియేటెడ్ కాలేజెస్ (ఏపీ ఎంసెట్-ఏసీ)ను మే 24న నిర్వహిస్తామని వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్- అసోసియేటెడ్ కాలేజెస్ (ఏపీ ఎంసెట్-ఏసీ)ను మే 24న నిర్వహిస్తామని వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఎంసెట్-ఏసీని ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్ల్లాడుతూ 2015-16 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ ఫీజులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేశామన్నారు. ఎంసెట్‌లో ప్రతిభ కనబరిచి.. మెరుగైన ర్యాంకు సాధించిన వారికి 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో కేటాయించామన్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు పొందే వారికి ఏడాదికి రూ.పది వేలు ఫీజుగా నిర్ణయించామని చెప్పారు. మిగతా 50 శాతం సీట్లలో 35 శాతం సీట్లు భర్తీ చేయడానికి ఈ ఏడాది నుంచి ఏపీ ఎంసెట్-ఏసీను

Advertisement
 
Advertisement
Advertisement