పదోన్నతుల కోసం విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ | electricity employees demand for promotion | Sakshi
Sakshi News home page

పదోన్నతుల కోసం విద్యుత్ ఉద్యోగుల డిమాండ్

Nov 19 2013 5:05 AM | Updated on Sep 2 2017 12:44 AM

ట్రాన్స్‌కో, జెన్‌కోలో పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని హైదరాబాద్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ(హై-జాక్) డిమాండ్ చేసింది.

సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌కో, జెన్‌కోలో పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని హైదరాబాద్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ(హై-జాక్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్‌కో ఎండీ విజయానంద్‌కు హై-జాక్ నేతలు గణేష్, నరసింహులు, రామకృష్ణుడు, మురళీ కృష్ణారెడ్డి సోమవారం వినతిపత్రం అందజేశారు. పదోన్నతులు ఆపాలని తెలంగాణవాదులు కోరడం సరికాదన్నారు. కాగా, ఉద్యోగులు 100వ నిరసన దినోత్సవాన్ని విద్యుత్ సౌధలో నిర్వహించారు. తెలంగాణకు 2 వేల మెగావాట్ల విద్యుత్‌లోటు ఉందని జైపాల్‌రెడ్డి అంగీకరించారని, ఈ నేపథ్యంలో విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా ఆయన సమైక్యాంధ్రను కోరుకోవాలని సూచించారు. ఢిల్లీలోనేతలను కలిసి సమైక్యాంధ్ర కోసం ప్రయత్నిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్టు హైజాక్ నేతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement