పోస్టింగ్‌లకు విభజన సెగ! | Division hit district | Sakshi
Sakshi News home page

పోస్టింగ్‌లకు విభజన సెగ!

Sep 4 2013 4:52 AM | Updated on Mar 28 2018 10:56 AM

విభజన సెగ జిల్లాను తాకింది. కొత్త పోస్టింగ్‌ల్లో తెలంగాణేతరుల నియామకం అగ్గికి ఆజ్యం పోస్తోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:విభజన సెగ జిల్లాను తాకింది. కొత్త పోస్టింగ్‌ల్లో తెలంగాణేతరుల నియామకం అగ్గికి ఆజ్యం పోస్తోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న తరుణంలో కీలకమైన పదవులు సీమాంధ్రులకు కట్టబెట్టడంపై ‘టీ’ ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. అధికారుల నియామకం ‘ప్రాంతీయ’రంగు పులుముకోవడం జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సచివాలయస్థాయిలో లాబీయింగ్ నెరిపి పోస్టింగ్‌లు దక్కించుకుంటున్న అధికారులను చేరకుండా నిలువరించేందుకు... ఉద్యమాలకు దిగుతుండడంతో ఆందోళనకు గురిచేస్తోంది. 
 
 ఈ క్రమంలోనే తాజాగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, ఉద్యానవన శాఖాధికారుల పోస్టింగ్‌లు వివాదాస్పదమయ్యాయి. సీమాంధ్రకు చెందిన అధికారులను జిల్లాలో నియమించడంపై టీఎన్జీవోలు గుర్రుమన్నాయి. కీలకమైన పోస్టింగ్‌లు వారికి కేటాయిస్తూ.. అప్రధాన శాఖల్లో తమను కుర్చోబెడుతున్నారని ఆరోపిస్తున్న ఉద్యోగసంఘాలు.. తాజా పరిణామాలను అస్త్రంగా మలుచుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అర్హులను కాదని, తెలంగాణేతరులను జిల్లాలో నియమించడాన్ని తప్పుబడుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిగా గుంటూరులో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
 ఈ పోస్టింగ్‌కు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ వైద్య, ఉద్యోగుల సంఘం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ఇదే సమయంలో అన ంతపురంలో పనిచేస్తున్న ఓ డాక్టర్‌ను క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అల్వాల్ పీహెచ్‌సీకి బదిలీ చేశారు. ఈ పరిణామం టీఎన్జీవోలకు ఆగ్రహం తెప్పించింది. ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్న సమయంలో సీమాంధ్రులను జిల్లాలో నియమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలావుండగా.... జిల్లా ఉద్యాన అధికారిగా ఉమాదేవికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.
 
 అయితే, ఉమాదేవిని కాదని మరొకరికి ఈ సీటును కట్టబెట్టాలని జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్ ప్రయత్నించారు. ఈ తరుణ ంలో విభజన వాదాన్ని తెరమీదకు తేవడం ద్వారా తన డిమాండ్‌ను నెరవేర్చుకోవాలని భావించారు. ఉమాదేవిని చేరికను ఆపేందుకు ఉన్నతస్థాయిలోను పావులు కదిపినట్లు ప్రచారం జరిగింది. అయితే... ఉమాదేవి మంగళవారం కలెక్టర్ శ్రీధర్‌ను కలిసి బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement