జిల్లా ఓటర్లు 20,76,545 | district voters 20,76,545 | Sakshi
Sakshi News home page

జిల్లా ఓటర్లు 20,76,545

Jan 25 2014 3:39 AM | Updated on Aug 14 2018 4:32 PM

ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకునేందుకు జిల్లాలోని యువత ఉత్సాహంగా ఉంది.

సాక్షి ప్రతినిది, కడప: ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకునేందుకు జిల్లాలోని యువత ఉత్సాహంగా ఉంది. గత ఏడాది కంటే ఈమారు 1,11,801 మంది కొత్తగా ఓటు హక్కును పొందారు. ఈ ఏడాది జనవరి 24వతేదీ నాటికి జిల్లాలో 20,76,545 మంది ఓటు హక్కును కల్గి ఉన్నారు. ఈ మేరకు  ఎన్నికల కమిషన్ శుక్రవారం  అధికారికంగా వెల్లడించింది. గత ఏడాది జనవరి 15వతేదీ నాటి కి జిల్లాలో 19,64,744 మంది ఓటు హక్కును కల్గి ఉన్నారు.  ఇటీవల ఓటు నమోదు  చేసుకునేందుకు  నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ కారణంగా జనవరి 24నాటికి 2,49,327 మంది ఓటు హక్కును పొందారు.
 
 వివిధ కారణాలతో తొలగింపుల జాబితాలో జిల్లాలో 1,37,526మంది ఉన్నారు. పది నియోజకవర్గాలలో  ప్రస్తుతం 20,76,545 మంది ఓటు హక్కు కల్గి ఉన్నట్లు   ఎన్నికల సంఘం తాజాగా  ధృవీకరించింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement