- ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ చంద్రుడు
విజయవాడ : డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యత నిర్వహించినట్లేనని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక బెంజిసర్కిల్ వద్ద 2కె డిజిటల్ ఇండియా ర్యాలీని శనివారం ఆయన ప్రారంభించారు.
ర్యాలీ బందరు రోడ్డులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం జేసీ మాట్లాడుతూ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు ఆధార్ నంబర్ను అనుసంధానంగా సంబంధిత వ్యక్తుల సర్టిఫికెట్లు తదితర ధ్రువపత్రాలను భద్రపర్చుకొనే సౌలభ్యం కల్పించినట్లు వివరించారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు సర్టిఫికెట్లను అంతర్జాలంలో ఉంచుకోవడం ద్వారా పూర్తి భద్రతకు అవకాశం ఉందన్నారు.
ప్రతి నిత్యం కోట్ల కొద్ది పేపర్ల ద్వారా లావాదేవీలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ డిజిటల్ లాకర్ను పొందాలని అన్నారు. మీ-సేవా కేంద్రాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రాంతీయ ఇంటర్మీడియెట్ అధికారి రాజారావు, జిల్లా ఎన్ఐసీ అధికారి శర్మ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రామకృష్ణ, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు పాల్గొన్నారు.
Breadcrumb
ఉద్యమంలా డిజిటల్ ఇండియా కార్యక్రమం
Published Sun, Jul 5 2015 2:23 AM
Related news
-
Israel-Hamas war: పాలస్తీనియన్లకు అమెరికా విద్యార్థుల సంఘీభావం
వాషింగ్టన్: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలో విద్యార్థుల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. గాజాలో మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వందలాది మంది ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ముందస్తుగా అనుమతి లేకుండా వర్సిటీ ప్రాంగణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఒక్కరోజే 100 మందికిపైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో గతవారం విద్యార్థుల ఆందోళన ప్రారంభమైంది. క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీలకు వ్యాపించింది. -
NASA భారత విద్యార్థులకు నాసా అవార్డులు
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్లో మన విద్యార్థులు సత్తా చాటారు.న్యూఢిల్లీ ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల బృందాలు నాసా అవార్డులను గెలుచుకున్నాయి.అలబామా రాష్ర్టంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అవార్డును గెలుచుకున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) సోమవారం ప్రకటించింది. అలాగే ముంబైకి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. కాగా ఈ పోటీలో అమెరికాలోని డాలస్కు చెందిన పారిష్ ఎపిస్కోపల్ స్కూల్ హైస్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ విభాగంలో హంట్స్ విల్లేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలబామా ప్రథమ బహుమతిని గెల్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా విద్యార్థులతో కూడిన 72 టీమ్స్ ఈ వార్షిక పోటీలో పాల్గొన్నాయి. అమెరికాలోని 24 రాష్ట్రాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ప్యూర్టోరికో, భారత్ సహా మరో 13 దేశాల నుంచి 42 కాలేజీలు, యూనివర్సిటీలు, 30 హైస్కూళ్ల విద్యార్థులు ఈ పోటీలో తన ప్రతిభను చాటారు. -
బాసర ఐఐఐటీలో కలకలం.. మరో విద్యార్థి ఆత్మహత్య
బాసర ఐఐఐటీలో కలకలం.. మరో విద్యార్థి ఆత్మహత్య -
జాతీయ స్థాయి ఇంగ్లిష్ పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ
సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ వర్డ్ పవర్ చాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించడంలో భాగంగా విభా, లీప్ ఫార్వార్డ్ సంస్థల ఆధ్వర్యాన నిర్వహించిన జాతీయ వర్డ్ పవర్ చాంపియన్షిప్ పోటీల్లో రాష్ట్రానికి రెండు బహుమతులు సాధించారు. గత నెల 14వ తేదీన విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులు ఈ నెల 12న ముంబైలో జరిగిన గ్రాండ్ ఫినాలే పోటీల్లో పాల్గొన్నారు. ఫైనల్స్లో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కనిమెర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన మూడో తరగతి విద్యార్థి బి.రేవంత్కుమార్ రెండో స్థానం, ఐదో తరగతి విద్యార్థి అనిల్కుమార్ బాణావత్ మూడో స్థానంలో నిలిచారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను అంచనా వేసేందుకు జాతీయ వర్డ్ పవర్ చాంపియన్షిప్ దేశంలోనే అతిపెద్ద పోటీ కార్యక్రమం. ఈ పోటీలో ఏపీ నుంచి ఐదుగురు విద్యార్థులు పాల్గొనగా, ఇద్దరు విద్యార్థులు రెండు, మూడు స్థానాల్లో నిలవడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి అభినందించారు. ఈఎల్పీ ద్వారా శిక్షణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు 2021లో ప్రభుత్వం ఇంగ్లిష్ లిటరసీ ప్రోగ్రామ్(ఈఎల్పి)ను ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆరీ్టతో విభా, లీప్ ఫార్వర్డ్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రొగ్రామ్ ద్వారా 2, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్ పదాలను సులభంగా పలకడం, చదవడం నేర్పిస్తున్నారు. కనిమెర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించడంతో ప్రభుత్వం చేపట్టిన ఈఎల్పీ సత్ఫలితాలు ఇస్తోందని స్పష్టమవుతోంది. -
నేడు ఇంటర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు వెల్లడించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుబ్బారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్షలను గత మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి అయ్యింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రకటించే మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను www.sakshi education.comలో చూడొచ్చు.
Related News by category
-
సర్కారు ఊతంతో పూల బాట
నవరత్నాల పేరుతో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతు న్నాయి. లక్షలాది మంది జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జీవకోనలోని రాఘవేంద్ర నగర్కు చెందిన వెంకటేష్, మునీశ్వరి కుటుంబమే ఇందుకు నిదర్శనం వెంకటేష్ 2019కి ముందు భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తూ చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుండేవారు. పని దొరికిన రోజు వచ్చే కూలి రూ.400తో ఆ కుటుంబంలోని ఆరుగురు జీవించాల్సి వచ్చేది. ఆయన భార్య మునీశ్వరి గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ముగ్గురు పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు తప్ప ఎలాంటి పథకాలు అందలేదు. మునీశ్వరి అత్తమ్మకు పింఛన్ కూడా వచ్చేది కాదు. జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగే లా తిరిగినా ఫలితం లేకపోయింది. పిల్లలను చది వించగలమా అనే బెంగతో ఉండేవారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ప్రవేశపెట్టిన నవరత్నాలతో ఆ కుటుంబానికి భరోసా లభించింది. వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, ముగ్గురు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి, కుటుంబంలోని మునీశ్వరి అత్తమ్మకు వృద్ధాప్య పింఛన్ లభిస్తోంది. ప్రస్తుతం ఒక కుమార్తె ఇంజినీరింగ్ పూర్తి చేసింది, మరో కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది. వీరిద్ధరూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కూలిపని మానేసి చెన్నై నుంచి ముడిసరుకు తెప్పించుకుని గృహాలకు ప్లాస్టిక్ పూల తోరణాలు, దేవుని చిత్రపటాలకు అవసరమైన పలు రకాల రంగులతో మాలలు, ప్లాస్టిక్ పూలతో షోకేజ్ డెకరేషన్ బొకేలు తయారు చేస్తూ మరో ఆరు మంది మహిళలకు ఉపాధి కబ్ధి స్తున్నారు. –తిరుపతి సిటీతలసరి ఆదాయం పెరిగింది గతంలో నిరుపేద మహిళలు కూలి పనులు చేసుకుంటూ లేదా ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. పిల్లలను చదివించలేక పోవడంతో వారు షాపుల్లో పనులు చేసుకుంటూ మంచి భవిష్యత్తు కోల్పోయి జీవితాలను సర్వనాశనం చేసుకునేవారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయి. వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ఇది కాదనలేని నిజం. అమ్మ ఒడి, ఫీజురియింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. –జి సవరయ్య, రిటైర్డ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మునీశ్వరి కుటుంబానికి కలిగిన లబ్ధి వైఎస్సార్ ఆసరా రూ.68,000 వైఎస్సార్ చేయూత రూ.75,000 జగనన్న విద్యాదీవెన రూ.28,000 వసతి దీవెన రూ.20,000 అమ్మ ఒడి రూ.30,000 సున్న వడ్డీ రూ.2,250 పింఛన్ కానుక రూ.96,000 మొత్తం రూ.3,19,250 -
నల్లమలకూ ఓ వీరప్పన్!
విలువైన కలపను టోకుగా కాజేశాడా నేత.. నల్లమల వీరప్పన్గా పేరుమోశాడాయన.. నాటుసారా వ్యాపారంలో అందెవేసిన చేయి.. తన సారా వ్యాపారానికి అడ్డొచ్చి న వారి అంతు చూడడానికి సైతం వెనుకాడనంత దౌర్జన్యపరుడు.. ఈ అక్రమాలన్నిటితో రూ.వేల కోట్లను అనతికాలంలోనే ఆర్జించి.. తన దోపిడీ సామ్రాజ్యాన్ని బలపరుచుకున్న నేత.. అక్కడి జనాన్ని తన కంటి చూపుతో శాసించారు.సారా వ్యతిరేకోద్యమం ముమ్మరంగా రాష్ట్రంలో ఊపేస్తే.. అప్పటి ఈ టీడీపీ నేత నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఈయనకు వ్యతిరేకంగా గొంతెత్తడానికి సాహసించలేకపోయారంటే జనాన్ని ఎంతగా భీతిగొలిపారో అర్థం చేసుకోవచ్చు. తుదకు తనఅక్రమాలకు మద్దతిచ్చే టీడీపీలో చేరారు.. అదొక్కటే కాదు.. అవకాశవాదంతో ఏ ఎండకా గొడుగు పడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోనూ చేరారు.. ఈ నేత నీడన పెరిగిన ఆయన తనయ ప్రస్తుతం టీడీపీ లోక్సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.సాక్షి, టాస్్కఫోర్స్: ఆ పేరు వింటే చాలు నల్లమల వీరప్పన్ గుర్తుకు వస్తారు. కొన్నేళ్ల కిందట నల్లమల అడవిని అడ్డాగా చేసుకుని తన వ్యాపారాన్ని సాగించారు. కలప చెట్లను ఇష్టానుసారం నరికి హైదరాబాద్కు తరలించి రూ. వేల కోట్లు సంపాదించారు. తనకు ఎదురుమాట్లాడితే వారి పని అంతే. అడ్డుకుందామని యతి్నంచిన అధికారులను నయానో భయానో లొంగదీసుకుని తన వ్యాపారాన్ని సాగించారు. అంగబలానికి తోడు అర్ధబలం తోడవడంతో ఆయన అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయింది. తండ్రి రాజకీయ అండతో..: తండ్రి రాజకీయ అండతో ఈ నేత విచ్చలవిడిగా సంపాదించారు. జూపాడుబంగ్లా, పగిడ్యాల, మిడుతూరు, ఓర్వకల్లు మండలాల్లో సొంతంగా సారా అంగళ్లు తెరిచారు. పల్లెలకు సారాను పరిచయం చేశారు. సారా వల్ల అనేక వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సారా అంగళ్లను తమ గ్రామాల్లో తొలగించాలని మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా, తన అంగబలంతో వాటిని అణచివేశారు.1989లో రాష్ట్ర వ్యాప్తంగా సారాకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. రోడ్ల మీదకి వచ్చి తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న సారా రక్కసిని పారదోలాలని రాష్ట్రమంతటా నినదించారు. ఒక్క నందికొట్కూరు నియోజకవర్గంలో మాత్రమే సారా ఉద్యమం చేయాలంటే గజగజ వణకాల్సిన పరిస్థితిని ఈ నేత సృష్టించారు. ఉద్యమం చేస్తే తమను ఏం చేస్తారోనన్న భయం నియోజకవర్గ ప్రజలను వెంటాడింది. ఉద్యమం పెద్ద ఎత్తున ఎగసిపడిన రోజుల్లోనూ స్థానికంగా మాత్రం సారా వ్యాపారం విచ్చలవిడిగా సాగిపోయింది. రూ.కోట్లలో విభేదాలతో బయటకు... 1993లో ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డితో సారా కాంట్రాక్టు విషయంలో ఈ నేతకు విభేదాలు వచ్చాయి. తన సారా వ్యాపారానికి సహకరించడంలేదన్న కోపంతో ఆయన టీడీపీలో చేరి 1994లో నందికొట్కూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అక్షరాస్యత పెద్దగా లేని నాటి రోజుల్లో అమాయక ప్రజలను తన రాజకీయ లబ్ధి కోసం ఈ నేత వాడుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు చేపట్టి ఎంతో మంది మహిళల పుస్తెలు తెంపిన ఘన చరితా ఈయనదేనన్న ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి ఎన్నికవడంతో.... 1999 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ నేత ఆగడాలు శృతిమించాయి. నల్లమల అడవిని చెరబట్టి అటవీ సంపదను కొల్లగొట్టారు. విలువైన కలపను ఇతర ప్రాంతాలను రవాణా చేసి రూ.కోట్లు గడించారు. అటవీ అధికారులను బెదిరించి విలువైన కలప చెట్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలించి రూ.వేల కోట్లు సంపాదించారు. ఆ నేత ఇంటిలో, హైదరాబాద్లోని హోటల్లో ఎక్కడ చూసినా విలువైన కలప కళాఖండాలు కనిపిస్తాయని ఉమ్మడి కర్నూలు ప్రజలందరికీ తెలుసు. బీడీల కట్టలు కట్టి అమ్ముకునే నిరుపేదల రక్తం తాగారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల నుంచి కారుచౌకగా బీడీ కట్టలను కొనుగోలు చేసి తాను మాత్రం ఎక్కువ రేటుకు విక్రయించి లాభాలు గడించారు. ఆ నేతకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఆయన ఆగడాలను ప్రశి్నంచినా వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే. ఈ నేతకు విలేకరులంటే అలుసు. అప్పట్లో విలేకరుల సమావేశాలంటూ పిలిచి కురీ్చలు కూడా వేసేవారు కాదు. పాత్రికేయులు నిలుచునే ఆయన చెప్పేది నోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా కేంద్రాలలో ఉండే ముఖ్య ప్రతినిధి వస్తే మాత్రమే కుర్చీ వేసేవారు. ∗ 2004లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ నేత వరుసగా పార్టీలు మారారు. కొద్ది రోజులు రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో హడావుడి చేశారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లోకి ఆయన వెళ్లొచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతూ ఊసరవెల్లి రాజకీయాలు సాగించిన ఘనత దక్కుతుంది. కేసులు.. వ్యక్తిని అక్రమంగా నిర్బంధించడంతో ఆయనపై ఐపీసీ 341 కింద నియోజకవర్గంలో కేసు నమోదైంది. ఐపీసీ 143, 188, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న తనయతండ్రికి తానేమీ తక్కువకాదన్నట్లుగా ఆయన తనయ వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఈమె నోరు తెరిస్తే చాలు అవతలి వ్యక్తి హడలిపోవాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లెలో ఈమెపై క్రిమినల్ కేసు నమోదైంది. దళిత వ్యక్తిని దూషించడంతో పాటు దాడి చేయడంతో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈమె టీడీపీ తరఫున లోక్ సభకు పోటీ చేస్తున్నారు. -
బిందువే సిరుల సింధువు
సాక్షి, అమరావతి : అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం పోళ్లోపల్లి రైతులను వర్షాభావం ఏళ్ల తరబడి పట్టి పీడించింది. అక్కడి రైతులు రాగి, సజ్జలు, ఉలవలు, అలసందలు, పెసర, మినుములు, పొద్దు తిరుగుడు మినహా ఇతర పంటలను సాగు చేయరు. కరవు కాటకాల వల్ల ఆరు తడి పంటలు సైతం ఏనాడూ పూర్తిగా చేతికందని దుస్థితి. గత్యంతరం లేక బతుకుదెరువు కోసం కొందరు కువైట్కు మరికొందరు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు.దశాబ్దాల పాటు ఊళ్లో యువకులెవరూ కానరాని విచిత్రం ఆ ఊరి సొంతం. ఈ గ్రామంలో 1,800 కుటుంబాల్లో 134 మంది రైతులుండేవారు. సేద్యం కలిసిరాక 100 మందికి పైగానే గ్రామం నుంచి వలస వెళ్లారు. అప్పో సప్పో చేసి సేద్యం చేసే వారి సంఖ్య 30కి మించి ఉండేదికాదు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడా గ్రామంలో మోటారు సైకిల్ లేని ఇల్లు లేదు. ప్రతి పదిళ్లకూ ఒక కారు ఉంది. పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు.ఒకప్పుడు ఈ ఊరి యువకులకు పిల్లనివ్వడానికే సంకోచించేవారు. ఇప్పుడు సంబంధాలు కుదుర్చుకోవడానికి పోటీ పడుతున్నారు. ఎందుకింత మార్పు అంటే..? సంక్షేమం ఆ గ్రామంలో ప్రతి తలుపూ తట్టింది. సేద్యంలో ఆ ఊరు గెలిచింది. సేద్యం లాభదాయకంగా మారి వలసలకు పగ్గాలు వేసింది. వేసిన పంటలు చేతికందుతున్నాయి. పెట్టుబడి పదింతలు మిగులుతోంది. పోళ్లోపల్లి రూపురేఖలను బిందుసేద్యం మార్చేసింది. కువైట్ నుంచి 90 శాతం స్వగ్రామానికి..ఒకప్పుడు అక్కడ పంటలకు నీటితడులు పెట్టేందుకు రాత్రనకా, పగలనకా చెలగ పార చేత పట్టుకుని పొలాల్లోనే కాపురాలు పెట్టేవారు. మోటారు కరెంటు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. పంటలు పండించడానికి ఇంటిల్లిపాదీ కష్టపడే వారు. ఇప్పుడు పగటి పూటే 9 గంటల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు అందుతుండడంతో నీటి తడుల కోసం బెంగలేకుండా పోయింది. కావాల్సినంత నీరందుతోంది. సూక్ష్మ సేద్యానికి సంక్షేమం తోడవడంతో వలస వెళ్లిన వారిలో నూటికి 90 మంది తిరిగి స్వగ్రామం బాటపట్టారు. ప్రస్తుతం ఆ గ్రామంలో రైతుల సంఖ్య 230కి పెరిగింది. ఒకప్పుడు సొంత పొలాలనే ఖాళీగా వదిలేసిన రైతులు ఇప్పుడు పక్క ఊళ్లోని పొలాలనూ కౌలుకు తీసుకుని సిరుల పంటలు పండిస్తున్నారు. 90 శాతం సబ్సిడీ (రూ.1.50 కోట్లు)తో నూరు శాతం విస్తీర్ణం (280 ఎకరాలు)లో బిందు పరికరాలను అమర్చుకున్నారు. బొప్పాయి, అరటి, జామ, సీతాఫలం.. ఇలా వివిధ రకాలను సాగు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. సంక్షేమంతో గ్రామానికి రూ.7 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా, పంట నష్టపరిహారం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ వంటి రైతు సంక్షేమ పథకాలతో పాటు అమ్మఒడి, చేయూత, ఆసరా లాంటి డజనుకు పైగా సంక్షేమ పథకాల రూపంలో గ్రామస్తులు రూ.7 కోట్లకు పైగా లబ్ధి పొందారు. ఫలితంగా వారిలో కొనుగోలు శక్తి పెరిగి పల్లె రూపురేఖలు మారాయి. సూక్ష్మసేద్యంతో ప్రభుత్వం తోడుగా నిలబడడంతో నాలుగేళ్లలో సుమారు రూ.1,500 కోట్లతో 6 లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాలను అమర్చుకుని 2.25 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 7.33 లక్షల ఎకరాలకు విస్తరణ రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. రాష్ట్రంలో మరో 28 లక్షల ఎకరాలు బిందు, తుంపర సేద్యానికి అనువైనదిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ఐదేళ్లలో 7.33 లక్షల ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకొచ్చి 2.60 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. సబ్సిడీ రూపంలో రూ.2,669.85 కోట్లు జమ చేసింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.800.16 కోట్లూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో సిఫార్సులున్న వారికే పరికరాలు ఇచ్చేవారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వంలో అర్హతే కొలమానంగా అడిగిన ప్రతి రైతుకు సిఫార్సులకు తావులేకుండా, కుల, రాజకీయ పక్షపాతం లేకుండా అర్హులందరికీ పరికరాలిచ్చారు. రైతులు తమ వాటా చెల్లించిన 15 రోజుల్లోగానే నేరుగా వారి క్షేత్రాలకు పరికరాలను తీసుకెళ్లి మరీ అమర్చారు. ఈ పథకం కింద లబ్ధి పొందే ఎస్సీ, ఎస్టీ రైతులకు మేలు చేసేందుకు తుంపర, బిందు పరికరాలపై కేంద్రం విధించే 12 శాతం జీఎస్టీలో 50 శాతం పన్నుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా రూ.60 కోట్లకు పైగా జీఎస్టీ భారాన్ని రైతుల తరపున ప్రభుత్వం భరించింది. రైతులకు రూ.1,034 కోట్ల పెట్టుబడి ఆదా సూక్ష్మసేద్యంలో గతేడాది జాతీయ స్థాయిలో ఐదవ స్థానంలో ఉన్న ఏపీ ఈ ఏడాది 4వ స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యుత్తమ 20 జిల్లాల్లో ఐదు జిల్లాలు (ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి) ఏపీకి చెందినవే. బిందు, తుంపర సేద్యంపై ఆర్బీకేల ద్వారా, ఆర్బీకే చానల్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎరువుల యాజమాన్యం, విద్యుత్ ఆదా, కూలీల ఖర్చు, నీటి ఆదాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ పథకం విస్తరణ ద్వారా 36,650 టన్నుల ఎరువులు, 11,383 లక్షల యూనిట్ల విద్యుత్, 110 టీఎంసీల నీరు ఆదా కాగా, రైతులకు రూ.1,034 కోట్ల కూలీల ఖర్చు మిగిలిందని గుర్తించారు. కువైట్ను వీడి కన్నతల్లి ఒడికి.. పోళ్లోపల్లికే చెందిన సంగరాజు చంద్రశేఖర్రాజు సేద్యం కలిసి రాకపోవడంతో 17 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లి అక్కడే ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మూడేళ్ల క్రితం గ్రామానికి తిరిగి వచి్చన ఆయన 90 శాతం ప్రభుత్వ సబ్సిడీతో డ్రిప్ ఏర్పాటు చేసుకున్నారు. 2.5 ఎకరాల్లో పచ్చ అరటి సాగు చేశారు. రూ.1.50 లక్షలు వ్యయం కాగా , రూ.6 లక్షల ఆదాయం వచి్చంది. మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని అమృతపాణి, సుగంధ అరటి, డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. రైతు భరోసా సహా వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.2.56 లక్షలు అందాయి. ‘ఇద్దరు పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివిస్తున్నా. ఇక సేద్యం వదిలి పెట్టను. ఊళ్లోనే దర్జాగా జీవిస్తా’..నంటూ ధీమాగా చెబుతున్నారాయన. పిల్లలకు కార్పొరేట్ చదువులు.. వ్యవసాయం కలిసిరాక కువైట్ వెళ్లిన నా భర్త సుబ్బరాజు మూడేళ్ల కిందట సొంతూరొచ్చారు. 5 ఎకరాల్లో తైవాన్ జామ, మరో 5 ఎకరాల్లో అరటి, బొప్పాయి సాగు చేపట్టాం. ప్రభుత్వ సబ్సిడీతో ఫారం పాండ్తో పాటు 90 శాతం సబ్సిడీపై రూ.1.30 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు తీసుకున్నా. జామకు రూ.3 లక్షలు ఖర్చు చేస్తే రూ.15 లక్షల ఆదాయం వచి్చంది. మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకుని అమృతపాణి జి–9 రకాన్ని వేశాం. రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా రూ.1.13 లక్షల ఆరి్థక సాయం అందింది. బిందు సేద్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు తోడవడంతో అమ్మాయిని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలోనూ, ఇద్దరు కుమారులను కార్పొరేట్ విద్యాసంస్థలో చదివిస్తున్నా. -ఉమ్మలరాజు సుజాత సమాజంలో గౌరవం పెరిగింది.. దినసరి కూలీగా పనిచేస్తూ ఐటీఐ చదువుకున్నా. ఉద్యోగం పేరిట మోసపోవడంతో కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకున్న 4 ఎకరాలకు 90 శాతం సబ్సిడీపై రూ.2 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు సమకూర్చుకున్నా. బొప్పాయిలో మేలైన రెడ్ లేడీ రకం సాగు చేశా. ఏడాదిలో రూ.15 లక్షల ఆదాయం వచి్చంది. రైతుభరోసా, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, ఆసరా పథకాల ద్వారా రూ.65 వేల వరకు లబ్ధి పొందాం. ఆర్థిక పరిస్థితి‡ మెరుగుపడడంతో సమాజంలో గౌరవం పెరిగింది. –పందేటి కృష్ణమరాజు పిల్లలను మోడల్ స్కూల్లో చదివిస్తున్నా.. 4.5 ఎకరాల్లో డ్రిప్ పరికరాల కోసం దరఖాస్తు చేస్తే 90 శాతం సబ్సిడీపై 2.61 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు అమర్చారు. కోలియోసిస్ అనే మెడిసిన్ ప్లాంటేషన్ చేశా. ఎకరాకు సగటున రూ.15 వేలు ఖర్చు చేశా. రూ.2.80 లక్షల ఆదాయం వచి్చంది. డ్రిప్తో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని నిమ్మ వేశా. రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.6 లక్షలు ఆదాయం తీశాను. సంక్షేమ పథకాల ద్వారా రూ.1.91 లక్షల మేర లబ్ధి పొందా. ఫలితంగా పిల్లలను మోడల్ స్కూల్లో చదివిస్తున్నా. బిందు సేద్యంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. సంక్షేమ ఫలాలు అందడంతో నిశి్చంతగా జీవిస్తున్నా. –మందా సుధాకర్ ఫలిస్తున్న సీఎం జగన్ కృషి ఉద్యాన హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.800 కోట్ల బకాయిలను చెల్లించడమే కాకుండా ఐదేళ్లలో రూ.2,670 కోట్ల సబ్సిడీ చెల్లించాం. 7.33 లక్షల ఎకరాలకు విస్తరించగలిగాం. –కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి 30 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయం..పోళ్లోపల్లికి చెందిన రైతు ఆనాల నరసింహులు 1989లో వ్యవసాయం భారమై బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ పడరాని పాట్లు పడి, సరైన సంపాదన లేక కుంగిపోయాడు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సూక్ష్మసేద్యంతో రైతులు లాభాలార్జిస్తున్నారని తెలిసి, నాలుగేళ్ల క్రితం గ్రామానికి తిరిగొచ్చి రెండెకరాల్లో నిమ్మ, 1.5 ఎకరాల్లో చీనీ వేశారు. నిమ్మ కాపు ప్రారంభమైన రెండేళ్లలోనే రూ.2.50 లక్షల ఆదాయం వచి్చంది.డ్రిప్ కోసం 2022లో ఆర్బీకేలో దరఖాస్తు చేసుకుంటే, సిఫార్సులతో పని లేకుండా 90 శాతం సబ్సిడీపై 3.5 ఎకరాల్లో రూ.62,934 విలువైన పరికరాలను అమర్చారు. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్, డ్రిప్ ఇరిగేషన్తో సాగు సాఫీగా సాగుతోంది. కువైట్కు తిరిగి వెళ్లాలన్న ఆలోచన విరమించుకుని 30 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయం చేపట్టిన నరసింహులు లాభాలు గడిస్తున్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ, ఆసరా, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన లాంటి పథకాల ద్వారా ఆయన కుటుంబం లబ్ధి పొందింది. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయగా, కొడుకును కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నట్లు ఎంతో ఆనందంగా చెప్పారాయన -
స్వతంత్ర అభ్యర్థులు ‘గ్లాస్’ గుర్తును ఎంచుకోవచ్చు: ఈసీ వర్గాలు
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో గుర్తులకు సంబంధించి ఈసీ వర్గాలు కీలక ప్రకటన చేశాయి. రాష్ట్రంలో జనసేన పోటీలో లేనిచోట గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్గా వాడుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా ఈసీ వర్గాలు.. జనసేన లేని చోట స్వతంత్ర అభ్యర్థులు కోరుకుంటే గ్లాస్ గుర్తును ఎంపిక చేసుకోవచ్చు. గ్లాస్ గుర్తు కామన్ సింబల్ అంటూ ఓ వర్గం మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అని ధృవీకరించాయి. -
మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాల కారణంగా పింఛన్దారుల కష్టాలు తొలగిపోలేదు. మే నెలలో కూడా పింఛన్ పొందేందుకు అవస్థలు తప్పేలా లేవు. దాదాపు ఐదేళ్లుగా వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరుతున్న పింఛన్ను అడ్డుకున్నది టీడీపీ వారేనన్న విషయం అందరికీ తెలిసిందే. వలంటీర్లతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్కుమార్ కోర్టులను, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. పింఛన్ల పంపిణీతో సహా సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లను వినియోగించరాదని, వారిని పూర్తిగా పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పింఛన్దారులకు మొదటిసారిగా ఏప్రిల్ నెలలో కష్టాలు మొదలయ్యాయి. ఎర్రటి ఎండలో ముదిమి వయస్సులో పింఛన్ కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలోసచివాయాలకు వెళ్లాల్సి రావడంతో వడదెబ్బ, ఇతర కారణాలతో 35 మంది మృత్యువాత పడ్డారు. టీడీపీ నేతల కుట్రల ఫలితంగా మే నెలలో కూడా పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే మే నెల పింఛన్ల పంపిణీలో అధికారులు కొన్ని మార్పులు చేశారు.నగదు బదిలీ సాధ్యమేనా? పింఛన్ల పంపిణీలో మే నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పింఛన్ మొత్తం బదిలీ చేయనున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న వారు, మంచం పట్టి వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక్ సంక్షేమ పింఛన్లు పొందుతున్న వారికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తారు. మిగిలిన కేటగిరీ పింఛన్దారులకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. డీబీటీ పరిధిలోకి రాని వారికి మాత్రం 3వ తేదీ నుంచి నగదు రూపంలో ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేస్తారు. చాలా మంది పింఛన్దారులకు బ్యాంకు ఖాతాలు లేవు.డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ఎంతవరకు విజయవంతం అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఠంచన్గా ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము చేతితో పడితే ఆ ఆనందమే వేరు. డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తే నగదు కోసం మళ్లీ బ్యాంకులకు వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్దారులకు టీడీపీ నేతల కుట్రలతో కష్టాలు మొదలయ్యాయనేది బహిరంగ రహస్యమే. తమకు కష్టాలను తెచ్చి పెట్టిన వారికి ఓటుద్వారా బుద్ధి చెబుతామని అవ్వాతాతలు స్పష్టం చేస్తున్నారు. మే నెల పింఛన్ల పంపిణీ 5వ తేదీ వరకు జరగనుంది. మే నెలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,68,742 పింఛన్లకు రూ.139.82 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,46,340 పింఛన్లకు రూ.73,74,49,500, నంద్యాల జిల్లాలో 2,22,402 పింఛన్లకు రూ.66,08,47,000 పంపిణీ చేయనున్నారు.సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు ∙ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కర్నూలు(సెంట్రల్): లబి్ధదారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాయాలకు రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలియజేశారు. సామాజిక భద్రత పింఛన్ పంపిణీ అంశంపై స్పెషల్ సీఎస్ ఆజయ్జైన్, పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పింఛన్దారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన వారు, వీల్ చైర్లో ఉన్న వారు, సైనిక సంక్షేమ పింఛన్ పొందుతున్న వారు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేస్తామన్నారు. ఎవరికైనా బ్యాంకు ద్వారా చెల్లించలేని పక్షంలో ఇంటివద్దకే పింఛన్ తెచ్చి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి,జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సలీం బాషా పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement