డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ తృతీయ సంవత్సరం అడ్వాన్స్ సంప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను వైస్చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ శుక్రవారం తన కార్యాలయంలో విడుదల చేశారు.
డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
Aug 17 2013 2:25 AM | Updated on Sep 2 2018 4:46 PM
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్లైన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ తృతీయ సంవత్సరం అడ్వాన్స్ సంప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను వైస్చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ శుక్రవారం తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ఏడాది జూన్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 2,897 మంది విద్యార్థులు హాజరుకాగా 1179 మంది ఉత్తీర్ణులయ్యారు.
బీఏలో 393 మందికి 156(39.69 శాతం) మంది, బీఎస్సీలో 2025 మందికి 807(39.85), బీకాంలో 470 మందికి 208(44.26) బీబీఎంలో 9 మందికి 8(88.89)మంది ఉత్తీర్ణత సాధిం చారు. మార్కుల జాబితాలను త్వర లో కళాశాలలకు అందజేస్తామని వీసీ చెప్పారు. రీవేల్యుయేషన్ కోసం 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకో వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజి స్ట్రార్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్ ప్రకారం బీఈడీ పరీక్షలు
బీఈడీ థియరీ పరీక్షలను ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తామని వీసీ లజపతిరాయ్ చె ప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థుల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దిబ్బదింటాయన్నారు.
Advertisement


