ప్రస్తుతం 85 శాతం మందికే సరుకులు
ఆహార భద్రతా చట్టం ప్రకారం
67 శాతం మందికే అంటున్న కేంద్రం
మిగిలిన 18 శాతం మందికి ఎగనామం
జిల్లాలో 3.2 లక్షల కార్డుల తొలగింపునకు సన్నాహాలు
దరఖాస్తు చేసుకున్నా కొత్త కార్డులు ఇక లేనట్టే
అయోమయంలో పేదలు
తెల్ల రేషన్కార్డులకు కోతపెట్టేందకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనలను సాకుగా చూపి కొత్తకార్డుల జారీకి మంగళం పాడేందుకు రెడీ అయిపోయింది. మరో సారి సర్వేల పేరుతో ఉన్నకార్డులను ఊడబెరికి పచ్చచొక్కాలోళ్లకు కట్టబెట్టేందుకు సమాయత్తమైంది.
చిత్తూరు:కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దారిద్య్రరేఖకు దిగువునున్న తెల్ల రేషన్కార్డుదారులైన పేదలకు శాపంగా మారింది. 67 శాతం మందికి జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని వర్తింపచేస్తామని తాజాగా ప్రకటించింది. దీన్ని సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పెద్ద ఎత్తున తెల్లరేషన్కార్డుల తొలగించేందుకు సమాయ త్త మవుతోంది. ఇప్పటివరకు జిల్లా జనాభాలో 85 శాతం మందికి తెల్లరేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం తాజా గా ప్రకటించినట్లు 67 శాతం మందికి మాత్రమే ఆహార భద్రత చట్టం వర్తింపజేసే పక్షంలో మిగిలిన 18 శాతం మంది పేదలు ఆహారభద్రత కోల్పోతారు. వారికి నిత్యావసర సరుకులు అందే పరిస్థితి లేదు. ప్రస్తుతం జిల్లాలో 10,39,953 నివాస గృహాలు ఉండగా 41,74,064 వేల జనాభా ఉన్నారు. వీరిలో 9,80,888 కుటుంబాలకు తెల్లరేషన్కార్డులున్నాయి. 1,34,162 కుటుంబాలకు చక్కెర కార్డులున్నాయి. వీరుగాక మరో 1,17,524 మంది కొత్తగా తెల్లరేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో 1,06,811 మంది తెల్లరేషన్కార్డులకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. కానీ రేషన్కార్డులు మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 67 శాతం మందికి మాత్రమే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సరుకులు పంపిణీ చేస్తామని తేల్చి చెప్పిన నేపథ్యంలో మిగిలిన 18 శాతం మందిని ఆహార భద్రతా చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ప్రస్తుతమున్న 9,80,888 తెల్లరేషన్కార్డుల్లో 6,57,195 (67 శాతం) తెల్లకార్డులను మాత్రమే ఉంచి, మిగిలిన 3,23,693 (18శాతం) తెల్లరేషన్కార్డులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. గుత్తమొత్తంగా అన్ని కార్డులను ఒకేసారి తొలగి స్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో మరోమారు బోగస్ కార్డుల ఏరివేత సాకుతో తెల్లకార్డులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తెల్లరేషన్కార్డుల పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడినట్లే. కార్డుల కోసం ఎదురుచూస్తున్న 1,17,524 మంది పేదలకు కార్డులు అందే అవకాశం లేనట్టేనని సమాచారం.
తెలుగు తమ్ముళ్లకే తెల్లకార్డులు
కేంద్ర ఆహారభద్రతా చట్టం సాకుతో రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నాయకులు చెప్పి వారికి మినహా మిగిలిన వారి తెల్లకార్డులన్నింటినీ తొలగించేందుకు అధికార పార్టీ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే జన్మభూమి కమిటీల మాటున అర్హులైన పేదల కార్డులను ఏకపక్షంగా తొలగిస్తున్న అధికార పార్టీ నేతలు కేంద్రం తాజా ఉత్తర్వులను అనువుగా చేసుకు పెద్ద ఎత్తున అర్హుల రేషన్కార్డులను తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రత్యేకించి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల తెల్లకార్డుల తొలగింపే ధ్యేయంగా తెలుగు దేశం నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెల్లకార్డులకు కత్తెర
Published Sat, Jul 4 2015 1:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement