దంపతులు బలవన్మరణం
కుటుంబ కలహాలే కారణమన్న బంధువులు
అనాథగా మిగిలిన కుమారుడు
చిత్తూరు (అర్బన్): ఏమయ్యిందో ఏమో గానీ... మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ‘ నా భార్య ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. రండి నాన్న..’ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి అతను కూడా నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. మూడేళ్ల కుమారుడు వచ్చీరానీ మాటలతో ‘మా అమ్మానాన్న చనిపోయారు..’ అంటూ వచ్చిన వాళ్లకందరికీ చెబుతుండటం కన్నీరు తెప్పించింది. చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా..
చిత్తూరు నగరంలోని గిరింపేటకు చెందిన గోపి(36)కి, తిరుపతి ఇంద్రానగర్కు చెందిన ఉమామహేశ్వరి(22)కి 2011లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు బాలు ఉన్నాడు. గోపి నరహరిపేటలో మోటారు వాహన తనిఖీ అధికారి జగదీష్ వద్ద వ్యక్తిగత డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులు మిట్టూరులోని మెసానికల్ మైదానం సమీపంలో ఓ అద్దె ఇల్లు తీసుకుని కాపురముంటున్నారు. అయితే భార్యాభర్త చిన్న విషయాలకే గొడవ పడేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గోపి, అతని భార్య ఉమామహేశ్వరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. క్షణికావేశంలో ఓ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. కొద్ది సేపు తరువాత గీపి తలుపు తీసి చూడగా ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందింది. జరిగిన విషయాన్ని గోపి తన తండ్రికి ఫోన్లో చెప్పాడు. కంగారుతో వచ్చిన గోపి తండ్రి ఇంట్లో తలుపు తెరచి చూడగా.. ఓ వైపు కోడలు ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతోంది. మరోవైపు కన్న కొడుకు మరో గదిలోని ఫ్యాన్కు ఉరి వేసుకుని శవమై కనిపించాడు.
కాగా మనవడు బాలు నిద్రపోతున్నాడు. చిన్నపాటి సమస్యకే ఆత్మహత్య చేసుకుంటారా అంటూ రోదిం చారు. సమాచారాన్ని పోలీసులకు చెప్పడంతో వన్టౌన్ ఎస్ఐ తేజోమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బుధవారం ఉదయం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పోలీసుల విచారణ అనంతరం ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి రానున్నాయి.
ఏమయ్యిందో ఏమో ..
Published Thu, Aug 27 2015 1:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement