తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం దుప్పిలిపాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం దుప్పిలిపాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్పీ బెటాలియన్ జీపు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.