ఇంటికి దారి కల్పించే విషయమై గొడవపడిన కానిస్టేబుల్ మద్యం సీసాతో మహిళను కొట్టి గాయపరిచాడు.
ఇంటికి దారి కల్పించే విషయమై గొడవపడిన కానిస్టేబుల్ మద్యం సీసాతో మహిళను కొట్టి గాయపరిచాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని సిద్దయ్యగుట్ట ప్రాంతంలో హిందూపురం పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న చంద్రశేఖర్ నివాసం ఉంటున్నాడు. అదే వీధిలో ఉండే సుశీల ఇంటికి దారి కల్పించే విషయమై చంద్రశేఖర్తో విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇద్దరూ గొడవ పడ్డారు. కానిస్టేబుల్ చంద్రశేఖర్ మద్యం బాటిల్తో సుశీల చెంపపై గట్టిగా కొట్టటంతో ఆమె చెంప తీవ్రంగా దెబ్బతింది. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.