
'విభజనపై కేంద్రం శరవేగంగా కదులుతోంది'
రాష్ట్ర విభజనపై కేంద్రం శరవేగంగా కదులుతున్నట్టు సమాచారం అందుతోందని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై కేంద్రం శరవేగంగా కదులుతున్నట్టు సమాచారం అందుతోందని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అయిదు కోట్ల మంది ప్రజలను అడ్డగోలుగా ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. ఈ చర్య సమైక్య స్పూర్తికి వ్యతిరేకమన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేలా కేంద్రం కసరత్తు చేయాలని జేపీ అన్నారు. సీమాంధ్రవారికి ఇబ్బంది కలగకుండా ఉండేలా బీజేపీ కూడా కృషిచేయాలని ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ విజ్ఞప్తి చేశారు.