36 మంది కమీషన్ ఏజెంట్లకు నోటీసులు
మరో 100 మందిపై కొర్రీలు పెడుతూ నివేదికలు
కాసుల కోసం అధికారుల కొత్త వలలు
సమంజసం కాదని తెగేసి చెప్పిన ఏజెంట్ల సంఘం
గుంటూరు మిర్చియార్డులో కమీషన్ ఏజెంట్లు, అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అదనపు ఆదాయం, అనధికార కాసుల కోసం అధికారులు వల విసరడం, నిబంధనల పేరిట తరచూ వేధింపులకు గురిచేయడం పలువురు కమీషన్ ఏజెంట్లకు తలనొప్పిగా మారింది. ఇటీవల యార్డు అధికారులు 36 మంది కమీషన్ ఏజెంట్లకు నోటీసులు జారీ చేయడం, వివరణ ఇచ్చిన తరువాత కూడా అధికారులు సరైన విధంగా స్పందించక పోవడం మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. తాజా వివాదానికి ఈ అంశమే కారణంగా కనిపిస్తోంది.
సాక్షి, గుంటూరు
మిర్చియార్డులో మొత్తం 582 మంది కమీషన్ ఏజెంట్లు లెసైన్సులు కలిగి ఉన్నారు. ఇందులో 193 మంది ఏజెంట్ల లై సెన్సుల కాలపరిమితి 2013 మార్చి 31తో ముగిసింది. వీరందరూ ఐదేళ్లకు ఒకేసారి లెసైన్సు ఫీజు చెల్లించి తమకున్న రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంది. అయితే కమీషన్ ఏజెంట్ల భాగస్వామ్య బదిలీల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం వీరి లెసైన్సుల రెన్యువల్స్ను నిలిపివేసింది.
ఆ తరువాత కమీషన్ ఏజెంట్లు పెద్ద మొత్తంలో సొమ్మును పైఅధికారులకు ముట్టజెప్పినట్లు వినికిడి. నెలలు గడుస్తున్నా లెసైన్సుల రెన్యువల్ పనులు జరగకపోవడంతో లోలోపలే ఆయా కమీషన్ ఏజెంట్లు కుతకుతలాడుతున్నారు. సమయం వచ్చినపుడు అధికారుల్ని నిలదీయాలని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యార్డు అధికారులు మరో 36 మందికి ముందస్తు సమాచారం, హెచ్చరికలు లేకుండా నోటీసులు జారీ చేశారు. వ్యాపారం చేస్తున్న ప్లాట్లు రిజిస్టర్డ్ ప్లాట్లు కావనీ, అనధికార వ్యాపారాలు జరుపుతున్నారంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపైఆయా ఏజెంట్లు సరైన వివరణ ఇచ్చినా అధికారులు స్పందించలేదని సమాచారం. ఇదిలా ఉండగా అత్యవసరంగా కార్యాలయానికి వచ్చి సమాధానం చెప్పాలని సోమవారం ఫోన్ చేయడం కమీషన్ ఏజెంట్లకు ఇబ్బందికరంగా మారిందిఅంతేకాకుండా మరో 100 మంది ఏజెంట్ల లెసైన్సుల విషయంలోనూ కొర్రీలు పెడుతూ నివేదికలు తయారు చేయడం కూడా వీరికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఏజెంట్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కిలారు రోశయ్య, శివరామిరెడ్డితో పాటు ముఖ్యమైన మిర్చి ఏజెంట్లు కొందరు సోమవారం మధ్యాహ్నం యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి నరహరిని కలిసి తమ వాదన వినిపించారు. వివిధ కారణాలతో కమీషన్ ఏజెంట్లను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని తెగేసి చెప్పినట్లు సమాచారం.
మరికొంత పిండేందుకేనా.. ఇదిలాఉండగా యార్డు అధికారులు, పాలక వర్గంలోని పలువురు సభ్యులు అదనపు ఆదాయం పైనే దృష్టి సారించారన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల కిందట కమీషన్ ఏజెంట్ల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు అందుకున్న కొందరు పైస్థాయి అధికారుల సహకారంతో మరోసారి వల విసిరేందుకు యార్డులోని అధికారులు, పాలకవర్గ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే సోమవారం కమీషన్ ఏజెంట్లను పిలిపించారని సమాచారం.
మిర్చియార్డులోకోల్డ్ వార్
Published Tue, Feb 25 2014 12:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement