వైఎస్‌ జగన్‌ను కలిసిన చోటా కే నాయుడు | Chota K Naidu Meets YS Jagan At Praja sankalpa Yatra | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన చోటా కే నాయుడు

Jul 9 2018 11:26 AM | Updated on Jul 26 2018 7:17 PM

Chota K Naidu Meets YS Jagan At Praja sankalpa Yatra - Sakshi

సాక్షి, మండపేట : ప్రభుత్వం వైఫ్యల్యాలను ఎండగడుతూ, ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు తూర్పు గోదావరి జిల్లా ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను జననేతతో విన్నించుకుంటున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ కోరుతున్నారు. వారికి భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.

వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు, కార్యకర్తలే కాకుండా సినీ ప్రముఖలు తమ మద్దతు తెలియచేస్తున్నారు. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడు వైఎస్‌ జగన్‌ను కలిశారు. సోమవారం, మండపేట నియోజకవర్గం సోమేశ్వరంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో జననేతను కలిసి తమ మద్దతును తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు. గతంలో ప్రజాసంకల్పయాత్రలో ప్రముఖ సినీనటులు పోసాని కృష్ణమురళి, పృధ్వీలు వైఎస్‌ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement