పిల్లలను అపహరించే గ్యాంగులు విజయవాడలో తిరుగుతున్నట్లు అనుమానంగా ఉందని నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.
పిల్లలను అపహరించే గ్యాంగులు విజయవాడలో తిరుగుతున్నట్లు అనుమానంగా ఉందని నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. నెల రోజుల్లోగా రద్దీగా ఉండే దుకాణాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని, లేకపోతే జరిమానాలు తప్పవని అన్నారు.
దుకాణాలను కూడా సీజ్ చేస్తామని సీపీ హెచ్చరించారు. ఈ మేరకు దుకాణాల యజమానులకు ఆయన సూచన చేశారు. పేద పిల్లలనే కిడ్నాపర్లు లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉందని, పిల్లలను ఒంటరిగా పంపించొద్దని సూచించారు.