నందివాడ : హైకోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని తమిరిశలో పొక్లెయిన్తో చేపల చెరువు తవ్వకం పనులు నిర్వహిస్తుండగా గ్రామస్తులు ఆది వారం అడ్డుకున్నారు. మండల కేంద్రమైన నందివాడలో శనివారం చెరువులు తవ్వాలనుకున్న వ్యక్తులే ఆది వారం తమిరిశలో కూడా ఇందుకు యత్నించారు. నందివాడలో మాదిరి గానే తమిరిశలో కూడా గ్రామస్తులు తవ్వకం పనులను అడ్డుకున్నారు. దీంతో పనులు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సార్వా, దాళ్వా పండే పొలా లను ఇలా చేపల చెరువులుగా మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్ధం కావటం లేదన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే చేపల చెరువు యజమానులకు పాలకులు ఎలా సహకరిస్తున్నారో తెలియటం లేదన్నారు. గ్రామంలో చేపల చెరువు తవ్వకం పనులపై సోమవారం మచిలీపట్నంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చేపల చెరువులకు మండల అధికారులే పరోక్షంగా సహకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
రెండు పంటలు పండే బంగారంలాటి భూములను చెరువులుగా మార్చడానికి అధికారులు ఎలా ఫైల్ పెడుతున్నారో అర్ధం కావటం లేదంటున్నారు. ఫైళ్లను కలెక్టర్కు పంపించటంలో అలస్యం జరుగుతుండటంతో భూముల యజమానులు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నట్లు తెలి పారు. అదే మొదటిలోనే వ్యవసాయ భూముల్లో చెరువుల తవ్వకం కుదరదని చెబితే సరిపోతుందన్నారు. అవసరమైతే అధికారుల తీరుపై కోర్టుకు సైతం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలో చెరువుల తవ్వకాలు జరగనివ్వమని వారు పేర్కొంటున్నారు.
చుట్టూ చెరువులేగా..
గ్రామ పరిధిలోని పలుచోట్ల చెరువులు తవ్వినపుడు గ్రామస్తులు ఏం చేస్తున్నారని కొతగా తవ్వకాలు తల పెట్టిన భూముల యజమానులు ప్ర శ్నిస్తున్నారు. అప్పుడు చూసీ చూడనట్లు వదిలేసి ఇప్పుడు ఇలా అడ్డుకోవటం అన్యాయమని వారు అంటున్నారు. చుట్టూ చేపల చెరువులు ఉండటంతో తమ భూముల్లో పంట లు సక్రమంగా పండటం లేదని చెబుతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వారు పేర్కొంటున్నారు.
చేపల చెరువు తవ్వకానికి బ్రేక్
Published Mon, Jun 16 2014 2:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement