నవ నిర్మాణ దీక్షలకు మరో రూ.6.55 కోట్లు

AP Govt Released 6.55 Crores Funds To Nava Nirmana Deeksha - Sakshi

ఇప్పటికే రూ.13.10 కోట్లు విడుదల

సాక్షి, అమరావతి : గత నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలకు మరో రూ.6.55 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రణాళిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దీక్షల కోసం గతంలోనే జిల్లాకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.13 కోట్ల రూపాయలను, విజయవాడలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభకు రూ.10 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ నిధులు సరిపోలేదని, మరిన్ని నిధులు వ్యయం అయినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లాకు మరో రూ.50 లక్షల చొప్పున రూ.6.50 కోట్లను, విజయవాడలో సీఎం సభకు మరో రూ.5 లక్షలను ప్రణాళికా శాఖ మంజూరు చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top