సాక్షి, అమరావతి: లాక్ డౌన్ సమయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగించినా, పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించకపోయినా, కార్మికుల కాలనీలను పరిశుభ్రంగా ఉంచకపోయినా, ఆహారం అందించకపోయినా పెండింగ్ బిల్లులు చెల్లించబోమని కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయని కాంట్రాక్టర్లపై కార్మిక, అంటువ్యాధుల నియంత్రణ చట్టాల కింద కఠినచర్యలు తీసుకోవాలని సీఈలను ఆదేశిస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
► రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేస్తున్న 7,233 మంది కార్మికులు, ఆ ప్రాజెక్టుల సమీపంలోనే 62 కాలనీల్లో నివాసం ఉంటున్నారు.
► ఒక్క పోలవరం ప్రాజెక్టు పనుల్లోనే 5,078 మంది కార్మికులు ఉన్నారు.
► కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో కార్మికుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
► లాక్ డౌన్ అమల్లో ఉన్నన్ని రోజులు కాంట్రాక్టర్ వద్ద రెగ్యులర్గాగానీ, అవుట్ సోర్సింగ్లోగానీ పనులు చేస్తున్న ఒక్క కార్మికుడినీ తొలగించకూడదని జలవనరుల శాఖ సూచించింది.
► కార్మికుల కాలనీలను డీఎంహెచ్వోల ద్వారా తనిఖీలు చేయించి, వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స అందజేయాలని సీఈలను ఆదేశించింది.
► పనులు చేసే ప్రదేశంలో భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
► కార్మికుల సంక్షేమానికి సర్కార్ జారీ చేసిన మార్గదర్శకాలను కాంట్రాక్టర్లు అమలు చేస్తున్నారా లేదా అన్నది పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సీఈలకు సూచించింది.
► మార్గదర్శకాలను అమలు చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది.
కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తే పెండింగ్ బిల్లులు చెల్లించం
Published Wed, Apr 1 2020 4:37 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement