అనంతలో యువరైతు ఆత్మహత్య | another former commits sucide in anantapuram | Sakshi
Sakshi News home page

అనంతలో యువరైతు ఆత్మహత్య

Aug 23 2015 7:11 PM | Updated on Jun 1 2018 8:31 PM

అనంతపురం జిల్లాలో మరో యువరైతు ఆత్మహత్య పాల్పడ్డాడు.

నార్పల: అనంతపురం జిల్లాలో మరో యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నార్పల మండలం దుగుమర్రి గ్రామానికి చెందిన నాగరాజు (27) ఆదివారం పురుగుల మందుతాగి బలవన్మరనానికి పాల్పడ్డాడు.

తనకున్న నాలుగెకరాల భూమిలో పత్తిపంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తుపకప నాగరాజు.. పంట వేయడానికి పెట్టుబడి కోసం రూ. 2 లక్షలు అప్పు తెచ్చాడు. పంట ఎండిపోవడంతో అప్పు తీర్చే దారి కనపడక.. ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement