16 మంది ఏపీ హైకోర్టు సిబ్బందికి కరోనా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టుల్లో కూడా కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. అయితే అత్యవసర పిటిషన్లను ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.