సాంస్కృతిక రాజధానిగా విజయవాడ | Andhra Pradesh Cultural Centre to setup in Vijayawada | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక రాజధానిగా విజయవాడ

Jun 23 2014 7:48 PM | Updated on Aug 18 2018 4:13 PM

విజయవాడను సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పులి సాంబశివరావు అన్నారు.

విజయవాడ: విజయవాడను సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పులి సాంబశివరావు అన్నారు. విజయవాడలోని దాసరి నాగభూషణరావు భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళారంగ అభివృద్ధి కోసం సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు కేటాయించాలని కోరారు.

నూతన రాష్ట్రంలో సమగ్ర సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలన్నారు. కళాకారుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. వృద్ధ కళాకారులకు ఇస్తున్న పింఛను రూ. 2వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలుచేయకపోతే  కళారూపాల ద్వారా ప్రభుత్వ చర్యలను ఎండగడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement