మాతృభూమి అభివృద్ధికి ఆనందరావు కృషి | Anandaravu working for development of the motherland | Sakshi
Sakshi News home page

మాతృభూమి అభివృద్ధికి ఆనందరావు కృషి

Jun 6 2017 10:57 PM | Updated on Sep 5 2017 12:57 PM

ఓ సామాన్య గ్రామీణ రైతు కుటుంబంలో పుట్టిన కంచరాన ఆనందరావు అంచెలంచెలుగా శాస్త్రవేత్తగా ఎదిగారని, ఆయన ఎక్కడ పని చేసినా జన్మభూమి రుణం

మందస: ఓ సామాన్య గ్రామీణ రైతు కుటుంబంలో పుట్టిన కంచరాన ఆనందరావు అంచెలంచెలుగా శాస్త్రవేత్తగా ఎదిగారని, ఆయన ఎక్కడ పని చేసినా జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారని పలువురు వక్తలు కొనియాడారు. మందస మండలంలోని కుంటికోటకు చెందిన పశు పరిశోధన శాస్త్రవేత్త ఆనందరావు నేషనల్‌ ఫెలోషిప్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సయ్యద్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కుంటికోట వచ్చిన ఆయనకు సోమవారం స్థానికులు ఘన సన్మానం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ దుంపల లింగరాజు, శ్రీకాకుళం జిల్లా జూనియర్‌ అధ్యాపకులు సంఘం ఉపాధ్యక్షుడు చింతాడ శరత్‌బాబు, యుటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి గుంట కోదండరావు మాట్లాడుతూ.. పశు వైద్యాధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆనందరావు అదే శాఖలో శాస్త్రవేత్తగా ఎదిగి కుంటికోట గ్రామానికి మంచిపేరు తీసుకువచ్చారన్నారు. సొంత నిధులతో గ్రామం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చేస్తున్నారని, యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారని తెలిపారు. 2001వ సంవత్సరంలో జిల్లాలోనే ఉత్తమ పశువైద్యాధికారిగా అప్పటి కలెక్టర్‌ జవహర్‌రెడ్డి నుంచి అవార్డు అందుకున్నారని చెప్పారు.

 అనంతరం 2012లో ఉత్తమ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారన్నారు. 2015లో మిజోరాంలోని ఐజ్వాల్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పశు యాజమాన్య సదస్సులో ఉత్తమ పరిశోధనా పురస్కారం, 2016వ సంవత్సరంలో పశు వైద్యంలో నాటు మందుల పాత్రపై అంతర్జాతీయ స్థాయి డాక్టర్‌ బీదర్‌కర్‌ పురస్కారం లభించిందన్నారు. సన్మాన గ్రహీత ఆనందరావు మాట్లాడుతూ.. పశువుల కోసం టీకాలు కనిపెడతానని, జీవితాంతం గ్రామ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు కొర్ల హేమారావుచౌదరి, గుంట కేశవరావు, భీమారావు, దుంపల వైకుంఠరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement