పెన్షనర్ల ఆన్‌లైన్ కష్టాలు | 63 pensioners did not get pension due to problems | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల ఆన్‌లైన్ కష్టాలు

Aug 7 2015 4:59 PM | Updated on Sep 3 2017 6:59 AM

ఈ నెలలో ఎనిమిదో తేదీ వచ్చినా ఇంకా ఆ గ్రామంలో సామాజిక పింఛను దారులకు పింఛను అందలేదు.

కర్నూలు(కల్లూరు): ఈ నెలలో ఎనిమిదో తేదీ వచ్చినా ఇంకా ఆ గ్రామంలో సామాజిక పింఛను దారులకు పింఛను అందలేదు. ఇప్పటికీ ఆన్‌లైన్ (వెబ్సైట్) మోరాయిస్తుండటంతో పింఛను దారులు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో పెదపాడు గ్రామంలో ఇంకా 63 మంది లబ్ధిదారులకు పింఛను అందలేదు. దీంతో పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఏర్పడిన సమస్య కారణంగా పింఛను అందజేయలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement