మసీదులు, చర్చిల మరమత్తులకు 3 కోట్ల 36 లక్షలు మంజూరు.

30 Crores Released For Repairing Of  Mosques In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి :  మైనార్టీ శాఖా మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అంజాద్‌ బాషా..  వైఎస్సార్ కడప జిల్లాలోని  మసీదులు, చర్చిల మరమ్మత్తుల నిమిత్తం 3 కోట్ల 36 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తనను  డిప్యూటీ సీఎం చేసినందుకు సీఏం గారికి కృతజ్ఞతలు తెలిపారు.

వక్స్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం  కాకుండా చూస్తామని, వక్స్ బోర్డు ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం సోదరులు వినియోగిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లో వైఎస్సార్సీపీ అవినీతి రహిత పాలననే అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ఈ దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నారని, తాము కూడా అదే బాటలో ముందుకు వెళడానికి కృషి చేస్తామని పేర్కోన్నారు. జగన్‌ పాలన,  తన తండ్రి దివంగత రాజశేఖర్‌ రెడ్డి పాలనను మించేలా ఉండబోతుందని పేర్కోన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top