వడదెబ్బకు ఇద్దరి మృతి | 2 killed due to sunstroke in andhra pradesh | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఇద్దరి మృతి

Apr 6 2016 12:04 PM | Updated on Aug 18 2018 5:57 PM

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బతో జనం విలవిల్లాడుతూ ప్రాణాలు వదులు తున్నారు.

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బతో జనం విలవిల్లాడుతూ ప్రాణాలు వదులు తున్నారు. బుధవారం వివిధ జిల్లాల్లో  వడ దెబ్బతో ఇద్దరు మృతి చెందారు. కర్నూలు జిల్లా నందికోట్కూరు మండలంలో ఉపాధి కూలి పనులకు వెళ్లిన మహిళ వడదెబ్బకు గురై మృతి చెందింది. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీదేవి(38) కూలి పనులకు వెళ్లి వడదెబ్బకు గురై సొమ్మసిల్లిపడిపోయింది. ఇది గుర్తించిన తోటి కూలీలు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో వైపు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఏఈగా పని చేస్తున్న నాగభూషణ రావు వడదెబ్బకు గురై మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement