బైక్ బోల్తా: ఇద్దరి మృతి | 2 died in road accident at krishna district | Sakshi
Sakshi News home page

బైక్ బోల్తా: ఇద్దరి మృతి

Feb 29 2016 12:22 PM | Updated on Sep 3 2017 6:42 PM

కృష్ణా జిలా చందర్లపాడు సమీపంలో ఓ బైక్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

నందిగామ: కృష్ణా జిలా చందర్లపాడు సమీపంలో ఓ బైక్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మేడి యోహాను, మేడి బాబు నందిగామలో పచారీ సరుకులు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై చందర్లపాడుకు వెళుతున్నారు. ఈ క్రమంలో అధిక వేగంతో వెళుతూ కిలోమీటర్ రాయిని ఢీకొన్నారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా యోహాను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన బాబును నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement