కలుషిత నీరు తాగి 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని యార్లపూడి పంచాయితీ, బత్తలపల్లె గ్రామంలో చోటు చేసుకుంది.
బత్తలపల్లె(శ్రీకాళహస్తి రూరల్) : కలుషిత నీరు తాగి 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని యార్లపూడి పంచాయితీ, బత్తలపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. బత్తలపల్లెలో 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఓవర్ హెడ్ ట్యాంక్ను శుభ్రపరిచి ఏడాది గడచిపోవడంతో పాచిపట్టి పురుగులు పడ్డాయి. ట్యాంక్ పైభాగంలో మూత అమర్చకపోవడంతో తొండలు,బల్లులు పడి మృతి చెందాయి.
ఈ క్రమంలో కలుషితమైన ఆ నీటిని తాగడంతో 18 మందికి విరేచనాలు, వాంతులయ్యాయి. 108లో ఎంపేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు.అస్వస్థతకు గురైన వారిలో శంకరయ్య(37),వెంకటేశ్వరులు(27), మహాలక్ష్మి(28),సుబ్రమణ్యం(45), అమ్ములు(42), రేణుక(23),గురవమ్మ(60),గంగమ్మ(51), విజయమ్మ(55), వెంకటసుబ్బయ్య(52), సుబ్రమణ్యం (40), శంకరయ్య(37), జ్ఞానమ్మ(50), వనజ(18),ఇంద్రజ(15),రమాదేవి (21),సంపూర్ణమ్మ(40) ఉన్నారు.