సాధారణంగా ఏ గేమ్లోనైనా ఆటగాళ్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం అనేది మైదానంలో మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత క్రికెటర్లు గొడవ పడిన ఘటన ఆసీస్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో చోటు చేసుకుంది. నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా మొదటి టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాడివేడి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆటగాళ్లు మైదానం విడిచి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లే క్రమంలో తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది.