కట్టుకున్న భర్తే కాలయముడు | Vijayawada, Wife Killed By Husband | Sakshi
Sakshi News home page

కట్టుకున్న భర్తే కాలయముడు

Aug 31 2019 12:26 PM | Updated on Mar 20 2024 5:24 PM

సాక్షి, విజయవాడ రూరల్‌: భర్తే కాలయముడై భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన విజయవాడ రూరల్‌ మండలంలో జరిగింది. అనుమానమే పెనుభూతంగా మారింది. దీంతో కట్టుకున్న భార్యను రోకలి బండతో దారుణంగా హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం నిడమానూరు రామ్‌నగర్‌కు చెందిన సోమేలు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అతడికి భార్య అశ్విని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అశ్విని మరొకరితో సన్నిహితంగా ఉంటుందంటూ గత కొద్దిరోజులుగా సోమేలు గొడవ పడుతున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement