కృష్ణా జిల్లాకు చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ హర్షారెడ్డి పూణెలో అదృష్యమైన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడ రూరల్ మండలం నున్నగ్రామానికి చెందిన హర్షారెడ్డి 15 నెలల నుంచి కనిపించకుండాపోయారు. పూణెలోని వొడాఫోన్ కంపెనీలో హర్షారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు.15 నెలలుగా అతను ఉద్యోగానికి రాకపోయినా.. 10 నెలలు జీతాన్ని హర్షారెడ్డి ఖాతాలో వొడాఫోన్ కంపెనీ జమ చేసినట్టు తెలుస్తోంది.
కంపెనీ వాళ్లే తమ కొడుకుని ఏమైనా చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావుకు వినతిపత్రం ఇచ్చారు. అలాగే హర్షారెడ్డి తల్లిదండ్రులు ఆదివారం విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ను కలిసి.. తమ కొడుకు ఆచూకీ కోసం ఫిర్యాదు చేయనున్నారు.
తెలుగు టెకీ హర్షారెడ్డి అదృశ్యం.. కలకలం
Jan 20 2018 12:04 PM | Updated on Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement