ఎంత పెద్ద కుట్రో!

ఈసీ లెక్కల సాక్షిగా రాష్ట్రంలో ఓటు దొంగలెవరో తెలిసిపోయింది. చంద్రబాబు సర్కారే ఈ ఐదేళ్లలో జనాల ఓట్లకు చిల్లు పెట్టిందని తేలిపోయింది. ఎంతో రహస్యంగా సాగించిన గుట్టు రట్టయ్యింది. ప్రజాస్వామ్యంలో ఎంతో పవిత్రంగా భావించే లక్షలమంది ఓటు హక్కును  ఈ ప్రభుత్వం హరించింది. అయితే తమకేం తెలియదంటూ బొంకుతున్న చంద్రబాబు సర్కారు.. ఓటర్లు తగ్గడంపై ఎందుకు నోరు మెదపడం లేదు? దేశమంతా ఓటర్ల సంఖ్య పెరుగుతుంటే.. అందుకు భిన్నంగా మన రాష్ట్రంలో తగ్గడంపై చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది? ఓ కుండలో నీళ్లు నింపుతుంటే.. మరోవైపున దానికి ఎవరైనా చిల్లు పెడితే ఆ కుండ ఎప్పటికీ నిండదు. ఆ కుండలా రాష్ట్ర ఓటర్ల జాబితాను తయారుచేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top