అవినీతి నిర్మూలనకై వైఎస్ జగన్ తొలి అడుగు | Sakshi
Sakshi News home page

అవినీతి నిర్మూలనకై వైఎస్ జగన్ తొలి అడుగు

Published Thu, May 30 2019 4:46 PM

అవినీతి నిర్మూలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. కాంట్రాక్టుల్లో అవినీతి నివారణకు అన్ని శాఖలకు ఏపీ సీఎస్‌ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 1 నాటికి పనులు ప్రారంభం కాని కాంట్రాక్టులు రద్దు చేయాలని ఆదేశాలు పంపారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన బిల్లుల చెల్లింపునకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరపొద్దని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement