దగ్దమైన కారు,ఒకరు సజీవ దహనం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సుల్తాన్‌పూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. జౌటర్‌పై వెళ్తున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో కారులో చిక్కుకున్న ఒకరు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ కారు మేడ్చల్‌ నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తుంది. రిజిస్టేషన్‌ నంబర్‌ను(TS 07 GM 4666) బట్టి ఈ వాహనం మియాపూర్‌కు చెందిన శ్రీదేవి పేరు మీద ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.   

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top