ఆ మూడు రాష్ట్రాలు.. మళ్లీ బాంబ్‌ పేల్చిన చంద్రబాబు! | AP CM Chandrababu Comments on Three State Elections | Sakshi
Sakshi News home page

ఆ మూడు రాష్ట్రాలు.. మళ్లీ బాంబ్‌ పేల్చిన చంద్రబాబు!

Dec 13 2018 9:40 PM | Updated on Mar 20 2024 4:08 PM

తన ప్రచారంతో, అడ్డగోలు వ్యాఖ్యలతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని నిండా ముంచేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. తాజాగా విచిత్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలువడానికి టీడీపీనే కారణమంటూ ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కృషి వల్లనే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిందని ఆయన  చెప్పుకొచ్చారు. నిజానికి ఆ మూడు రాష్ట్రాల్లో చంద్రబాబు కనీసం ప్రచారం కూడా చేయలేదు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని.. ఆయన విస్తృతంగా ప్రచారం చేసిన తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement