భారత్ తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 477 పరుగుల భారీ స్కోరు సాధించింది. 284/4 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 193 పరుగులు చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా, టెయిలెండర్ల సాయంతో ఇంగ్లండ్ భారీ స్కోరును నమోదు చేసింది.