Sakshi News home page

గంటన్నరసేపు ఏం మాట్లాడారు: వైఎస్ జగన్

Published Fri, Aug 28 2015 12:22 PM

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే యువతకు మంచి జరుగుతుందని ఎవరిని అడిగినా చెబుతారని, అలాంటిది చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయాన్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ, టీడీపీ కలిసి చేసిన వాగ్దానాల సంగతేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రావటం లేదని కలత చెంది నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement