ఉత్తరాఖండ్‌ సీఎంకు సమన్లు | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌ సీఎంకు సమన్లు

Published Sat, Dec 24 2016 7:51 AM

ఉత్తరాఖండ్‌-లో సంచలం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (ఓటుకు నోటు) రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. గత ఏడాది దుమారం రేపిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంపై విచారణలో భాగంగా సీబీఐ ఈ చర్య తీసుకుంది. విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో సీఎంకు వ్యతిరేకంగా బయటపడిన స్టింగ్ ఆపరేషన్ కేసులో సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఈ నెల 26 (సోమ‌వారం)న‌ విచార‌ణ‌కు హాజ‌రుకావాలని ఆదేశించింది.